తుఫాను ప్రభావంతో పంట పోలాలు నీట మునగడంతో… రైతులను ప్రతిపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ బూర్ల రామాంజనేయులు పరామర్శించారు.
నీట మునిగిన వరి, పొగాకు, మొక్కజొన్న, మిర్చి, శనగ , ప్రత్తి,మినుము పంట పొలాలను సందర్శించారు. మోకాలు లోతులో నీరు ఉన్న పొలంలోకి వెళ్లి రైతుల నుండి ఎంత నష్టపోయారో అడిగి తెలుసుకున్నారు. అదైర్యపడవద్దు, ప్రభుత్వం నుండి మీకు రావాల్సిన నష్టపరిహాన్ని వచ్చే విధంగా టీడీపీ తరఫున పోరాటం చేస్తాము అని చెప్పారు. కాలవలలో పూడికతీత పనులు చేయకపోవడం వల్ల రైతులకు ఈ పరిస్థితి వచ్చిందన్నారు. పంట నష్టపోయిన రైతులందరికీ తక్షణమే నష్టపరిహారం ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు. జగనన్న కాలనీ కొరకు కేటాయించిన భూములు పరిశీలించి జగన్మోహన్ రెడ్డి చేతగానితనానికి ఈ ప్రాంతం ఒక నిదర్శనం అని పేర్కొన్నారు . పూర్తిగా మొలిచిన తుమ్మ చెట్లతో ఉన్న ప్రాంతాన్ని పరిశీలించారు.
నష్టపరిహారం ఇచ్చేదాకా పోరాటం ఆగదు..
362
previous post





Total views : 196996