రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కాలే యాదయ్య జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం మిఠాయిలు పంచుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం 1950 జనవరి 26వ, తేదీన అమల్లోకి రావడంతో ఇక అప్పటి నుంచి ఏటా గణతంత్ర దినోత్సవంను జరుపుకుంటున్నామని అన్నారు. చేవెళ్ల ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
Republic Day Celebrations
శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు ఒకటో సచివాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జాతీయ జెండా ఎగురవేయాల్సిన సచివాలయ సిబ్బంది కనీసం వేడుకలు కూడా నిర్వహించలేదు. పది రోజుల కిందట సచివాలయ ఆవరణలో వైసీపీ జెండాను ఎగరవేసి అలాగే ఉంచేశారు. నేడు దేశమంతా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంటే సచివాలయ సిబ్బంది మాత్రం ఫీల్డ్ పనిమీద బయటకెళ్లే అంశాన్ని సాకుగా చూపి గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించలేదు. దీంతో సచివాలయం వద్దకు వచ్చిన స్థానికులు వైసీపీ జెండా ఎగురుతుండడం చూసి సచివాలయ సిబ్బంది తీరుపై మండిపడుతున్నారు.
75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అవనిగడ్డ నియోజకవర్గంవ్యాప్తంగా ప్రభుత్వం, ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలలువద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాలు రెపరెపలాడాయి. అవనిగడ్డ లో వైసీపీ కార్యలయం వద్ద ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, గాంధీ క్షేత్రం వద్ద మాజీ ఉపసభాపతి టీడీపీ నాయకులు మండలి బుద్ధ ప్రసాద్, జనసేన పార్టీ కార్యలయం వద్ద చిలకలపూడి పాపరావు, అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని పోలీసులు స్టేషన్ వద్ద సబ్ ఇన్స్పెక్టర్లు, రెవెన్యూ, మండలపరిషత్ కార్యయలు వద్ద అదికారులు ప్రజాప్రతినిధులు, వివిధ పాఠశాలలు చెందిన విద్యార్థులు లతో కలిసి, జాతిపిత మహాత్మా గాంధీ, స్వతంత్ర సమరయోధులకు, జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన అనంతరం, జాతీయ జెండాలను ఎగరవేసి గౌరవ వందనాలు స్వీకరించారు. విద్యార్థిని, విద్యార్థులు జాతీయ గీతాలు ఆలపించారు. అనతరం75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రసంగించి, స్వీట్లు పంపిణీ చేశారు.
Read Also..
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ 75వ గణతంత్ర దినోత్సవ సందర్భముగా దుర్గ గుడి ఘాట్ రోడ్ లోని ఓం- టర్నింగ్ వద్ద దేవస్థానము వారు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమమునకు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్యనిర్వహణాధికారి కె ఎస్ రామరావు విచ్చేశారు. అనంతరం వీరు శ్రీ అమ్మవారి, శ్రీ రాముల వారి, భారతమాత, జాతిపిత మహాత్మాగాంధీ వారి చిత్ర పటాలకు ఆలయ అర్చకులు, వేదపండితులు, వేద విద్యార్థుల వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యముల నడుమ పూలు, పండ్లు సమర్పించి పూజలు నిర్వహించారు. తదుపరి ఆలయ కార్యనిర్వహణాధికారి వారు SPF సిబ్బంది, హోం గార్డ్స్ మరియు దేవస్థాన రక్షణ సిబ్బంది వారి గౌరవ వందనము అందుకుని, జెండా వందనము జేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొని జాతీయ గీతములు ఆలపించారు. తదనంతరము గణతంత్ర దినోత్సవ విశిష్టత గురించి, అమ్మవారి స్వాతంత్రోద్యమ నాయకుల గొప్పదనం గురించి చైర్మన్, కార్యనిర్వాహనాధికారి ప్రసంగించి అమ్మవారి సన్నిధిలో గణతంత్ర ఉత్సవములు జరుపుకోవడం అందరి పూర్వ జన్మ ఫలం అని అన్నారు. అనంతరం చిన్నారులకు, దేవస్థానము సిబ్బందికి, spf వారికి, భక్తులకు చైర్మన్ గారు, కార్యనిర్వహణాధికారి వారు అమ్మవారి లడ్డు ప్రసాదం, చాక్లెట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమములో ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు, వైదిక సిబ్బంది, వేదపండితులు, ఆలయ కార్యనిర్వాహక ఇంజినీరులు, సహాయ కార్యనిర్వహణాధికారులు, పొలిసు సిబ్బంది, ఇంజినీరింగ్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది, మరియు ఇతర దేవస్థాన సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
75వ భారత గణతంత్ర దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ఘనంగా నిర్వహించింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ వేడుకలు జరిగాయి. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన తర్వాత గవర్నర్ జస్టీస్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఎగరేశారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ మోహన్ రెడ్డితోపాటు.. ఆయన సతీమణి భారతి రెడ్డి, మంత్రులు పాల్గొన్నారు.
Read Also..





Total views : 78271