307
75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు. అనంతరం జాతీయ గీతాలాపన చేశారు. రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గారితోపాటు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లాల అధ్యక్షులు, వివిధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గం సభ్యులు, ముఖ్య నాయకులు, జన సైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.





Total views : 78307