చంద్రబాబు ఆక్వా రంగానికి చేసింది శూన్యం అని రాష్ట్ర పశు సంవర్ధక, మత్య శాఖ మంత్రి శిదిరి అప్పలరాజు అన్నారు. నరసాపురంలో ఆంధ్రప్రదేశ్ ఫీషరిష్ యూనివర్సిటి నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన మత్య సంపద జగ్రుక్త అభియాన్ వర్క్ షాప్ లో నరసాపురం ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సీఎం జగన్ అధికారంలోకి రాగానే ఆక్వా రంగానికి పెద్దపీట వేస్తూ ఆక్వా రైతులకు లబ్ది చేకూర్చే కార్యక్రమాలు చేశారన్నారు. నరసాపురంకు ఆక్వా యూనివర్సిటీ సాధించిన ఘనత ముదునూరి ప్రసాద్ రాజుకే దక్కిందన్నారు. చంద్రబాబు ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ లను పెట్టింది జగన్మోహన్ రెడ్డి అనడం చాలా హస్యస్పదంగా ఉందన్నారు. ఆక్వా జోన్ లో ఉన్న 10 ఎకరాల లోపు రైతులకు 3 లక్షల 45 వేల ఎకరాలకు ఇచ్చిన మాట ప్రకారం కరెంటు యూనిట్ కి 1.50 పైసలు సబ్సిడీ ఇవ్వడం జరిగిందన్నారు. 3480 కోట్లు ఆక్వా రైతులకు సబ్సిడీ ద్వారా అందించిన దమ్ము ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని కొనియాడారు. ప్రతి కనెక్షన్ కి 7 లక్షల రూపాయలు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు.
Tag:
sidiri appalaraju
శ్రీకాకుళం జిల్లా.. పలాసలో అంగన్వాడీలు కదం తొక్కారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన సమ్మె 20 రోజులకు చేరుకుంది. ఈ నేపథ్యంలో మంత్రి సీదిరి అప్పలరాజు ఇంటిని ముట్టడించారు. వేలాదిమంది అంగన్వాడీలు మంత్రి ఆఫీసు గేట్లను తోసుకుంటూ వెళ్లి అక్కడ బైఠాయించి తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడి లు మాట్లాడుతూ 20 రోజులుగా నిద్రాహారాలు మాని రాష్ట్రవ్యాప్తంగా లక్షల్లో అంగన్వాడీలు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలియజేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ఈ పోరాటం కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Read Also..





Total views : 78827