టిడిపి జనసేన పొత్తులో భాగంగా రూరల్ నియోజకవర్గం సీటు జనసేన కు కేటాయించడంతో టిడిపి నాయకులు కార్యకర్తలు అసహనానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో టిడిపి జోన్2 ఇంఛార్జి సుజయ కృష్ణ రంగారావు, కాకినాడ రూరల్ వలసపాకల పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి నివాసానికి వచ్చారు. టిడిపి నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. రూరల్ నియోజకవర్గాన్ని అన్నివిధాల అభివృధి పదంలో నడిపించిన పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి నాయకత్వం, బిసి సామాజిక వర్గానికి చెందిన వర్కి నియోజకవర్గం లో ఉన్న గుర్తింపు పట్టు రంగారావు దృష్టికి నాయకులు కార్యకర్తలు తీసుకువచ్చారు. అనంతరం రంగారావు మీడియా తో మాట్లాడుతూ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి దంపతులకు పార్టీలో ఎప్పుడు సముచిత స్థానం ఉందని, ఇక్కడ క్షేత్ర స్థాయిలో నాయకులు, కార్యకర్తల్లో ఉన్న అపోహలు, పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని ఎది ఏమైనా రాబోయే రోజుల్లో అందరి సమిష్టిగా కృషి చేసి జనసేన అభ్యర్థిని అఖండ మెజార్టీ తో గెలిపుంచుకుంటామని తెలిపారు.
tdp janasena alliance
టీడీపీతో పొత్తులో భాగంగా జనసేనన పార్టీ 24 అసెంబ్లీ సీట్లు, 3 లోక్ సభ స్థానాలకు అంగీకరించడం పట్ల పవన్ కల్యాణ్ నిన్న తాడేపల్లిగూడెం సభలో సొంత క్యాడర్ కు వివరించే ప్రయత్నం చేశారు. మనకు పోల్ మేనేజ్ మెంట్ ఉందా? టీడీపీలాగా మనకు సంస్థాగత బలం ఉందా? జగన్ లా మన వద్ద వేల కోట్లు ఉన్నాయా? బూత్ లెవల్లో మనకు కార్యకర్తలున్నారా? ఇవన్నీ ఆలోచించే 24 సీట్లకు ఒప్పుకున్నానని పవన్ వెల్లడించారు.
ఈ క్రమంలో సీఎం జగన్ ను అథఃపాతాళానికి తొక్కేస్తానంటూ ప్రతిన బూనారు. దీనిపై మంత్రి రోజా ఘాటుగా స్పందించారు. జగన్ ఏమీ ఆషామాషీగా ముఖ్యమంత్రి కాలేదని స్పష్టం చేశారు. తిరుగులేని ముఖ్యమంత్రిగా ప్రజల ఆశీస్సులతో ఎలా అయ్యాడు… ఊరికే అయిపోలేదుగా! అని వ్యాఖ్యానించారు.
Siddam Sabha :
రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభలో ప్రోగ్రాం కవర్ చేయడానికి వెళ్లిన ఆంధ్రజ్యోతి, టీవీ5 విలేకరులపై వైసీపీ గుండాలు అతి పాశవికంగా, క్రూరంగా, రాక్షసంగా వారిపై భౌతికంగా దాడి చేయడం జగన్ ఆటవిక పాలనకు నిదర్శనమన్నారు. జగన్ నిర్వహించిన సిద్ధం రాష్ట్రాన్ని తిరోగమన దిశగా తీసుకోపోయి ప్రజలను నట్టేట ముంచడానికి, సిద్ధం సభ నిర్వహించాడా! అని ఎద్దేవా చేశారు. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీ కృష్ణ పై వైసీపీ గూండాలు చేసిన దాడిలో ప్రాణాపాయ స్థితికి చేరుకోవడం గుండెలను కలిసివేస్తోందని జనసేన పార్టీ పుట్టపర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ పత్తి చంద్రశేఖర్, టిడిపి మైనార్టీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి షబ్బీర్, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి ఓబుల్ రెడ్డి, సిఐటియు డివిజన్ కార్యదర్శి లక్ష్మీనారాయణలు ఆవేదన వ్యక్తం చేశారు. విలేకరులపై విచక్షణారహితంగా దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి
వినతిపత్రం సమర్పించారు.
100 మీటర్ల రోడ్డు వేయడం చేతకాని సీఎం పోలవరం ను కడతారా అని ఉమ్మడి జిల్లాల జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర్లు అన్నారు. కాకుమాను మండలంలో పెదనందిపాడు నుండి బాపట్ల వెళ్లే రహదారిలో గల 100 మీటర్ల పొడవు కూడా లేని రోడ్డును బాగు చేయలేని అసమర్థ ప్రభుత్వం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. ఇక్కడ రోడ్డును వెంటనే పున్నమించకపోతే జనసేన టిడిపి ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని, ప్రభుత్వానికి మూడు రోజులు గడువు ఇస్తున్నట్టు ఈ లోపు పనులు వేగవంతం చేయాలని అన్నారు. ఈ రోడ్డు మీదుగా వెళ్లే వాహన చోదకులు అనునిత్యం ప్రమాదాలకు గురై ఆసుపత్రి పాలు అవటం జరుగుతుందని వెంటనే ఈ రహదారిని పునర్నిర్మించాలని లేనిచో తమ ఆందోళన తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.




Total views : 78512