టిడిపి జనసేన పొత్తులో భాగంగా రూరల్ నియోజకవర్గం సీటు జనసేన కు కేటాయించడంతో టిడిపి నాయకులు కార్యకర్తలు అసహనానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో టిడిపి జోన్2 ఇంఛార్జి సుజయ కృష్ణ రంగారావు, కాకినాడ రూరల్ వలసపాకల పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి నివాసానికి వచ్చారు. టిడిపి నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. రూరల్ నియోజకవర్గాన్ని అన్నివిధాల అభివృధి పదంలో నడిపించిన పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి నాయకత్వం, బిసి సామాజిక వర్గానికి చెందిన వర్కి నియోజకవర్గం లో ఉన్న గుర్తింపు పట్టు రంగారావు దృష్టికి నాయకులు కార్యకర్తలు తీసుకువచ్చారు. అనంతరం రంగారావు మీడియా తో మాట్లాడుతూ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి దంపతులకు పార్టీలో ఎప్పుడు సముచిత స్థానం ఉందని, ఇక్కడ క్షేత్ర స్థాయిలో నాయకులు, కార్యకర్తల్లో ఉన్న అపోహలు, పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని ఎది ఏమైనా రాబోయే రోజుల్లో అందరి సమిష్టిగా కృషి చేసి జనసేన అభ్యర్థిని అఖండ మెజార్టీ తో గెలిపుంచుకుంటామని తెలిపారు.
అసహనానికి గురైన టిడిపి నాయకులు కార్యకర్తలు…
315
previous post





Total views : 78754