Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Latest News నరేంద్ర మోడీ సంగారెడ్డి జిల్లా పర్యటన…

నరేంద్ర మోడీ సంగారెడ్డి జిల్లా పర్యటన…

by Prakash
Narendra Modi

నరేంద్ర మోడీ (Narendra Modi) :

ఈ నెల 5 వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) సంగారెడ్డి జిల్లాలో పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్న సందర్భంగా పటాన్ చెరు ఎల్లంకి కళాశాలలో ఎస్పీ రూపేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ పీఎం బహిరంగ సభ స్థలానికి చేరుకునే వాహన దారులు నిబంధనలు, ఆంక్షలు పాటించవలసి ఉంటుందన్నారు. బస్సులలో మీటింగ్ ప్లేస్ కు వచ్చే వారు కామారెడ్డి, రామాయం పేట, తూప్రాన్ వైపు నుండి మీటింగ్ కు వచ్చే బస్సులు కండ్లకోయ వద్ద, సిద్ధిపేట, గజ్వేల్ వైపు నుండి మిటింగ్ కు వచ్చే బస్సులు షామీర్ పేట్ వద్ద, మెదక్, నర్సాపూర్ వైపు నుండి మీటింగ్ కు వచ్చే బస్సులు గుండ్ల పోచమ్మ వద్ద, సంగారెడ్డి, జహిరాబాద్, జోగిపేట, వైపు నుండి మీటింగ్ కు వచ్చే బస్సులు ముత్తంగి ఎగ్జిట్ నెంబర్ -3 వద్ద, హత్నూర, దౌల్తాబాద్ వైపు నుండి మీటింగ్ కు వచ్చే బస్సులు ముత్తంగి ఎగ్జిట్ నెంబర్ -3 వద్ద, హైదరాబాద్, లింగం పల్లి మీదుగా మీటింగ్ కు వచ్చే బస్సులు ముత్తంగి వద్ద ORR ( ఔటర్ రింగ్ రోడ్డు ) ఎక్కి సుల్తాన్పూర్ ఎగ్జిట్ నెంబర్ -4 వద్ద దిగి, కిష్టా రెడ్డి పేట, పటేల్ గూడా మీదుగా ఎల్లంకి కళాశాల వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్లేస్ కు చేరుకోవాల్సి ఉంటుందన్నారు. కార్లల లో మీటింగ్ ప్లేస్ కు వచ్చే వారికి సూచనలు చేశారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News


కామా రెడ్డి, రామాయం పేట, తూప్రాన్ వైపు నుండి కార్లలో మీటింగ్ కు వచ్చేవారు కండ్ల కోయ వద్ద, సిద్ధి పేట, గజ్వేల్ వైపు నుండి కార్లలో మీటింగ్ కు వచ్చేవారు షామీర్ పేట్ వద్ద, మెదక్, నర్సాపూర్ వైపు నుండి కార్లలో మీటింగ్ కు వచ్చేవారు గుండ్ల పొచమ్మ వద్ద ORR ( ఔటర్ రింగ్ రోడ్డు ) ఎక్కి, ముత్తంగి ఎగ్జిట్ నెంబర్ -3 దగ్గర దిగి ఎడమ చేతి వైపు సర్వీస్ రోడ్ ద్వారా రామేశ్వరం బండ దగ్గర గల పార్కింగ్ ప్లేస్ కు చేరుకోవాల్సి ఉంటుందన్నారు. సంగారెడ్డి, జహీరాబాద్, జోగిపేట వైపు నుండి కార్లలో మిటింగ్ కు వచ్చేవారు ముత్తంగి ఎగ్జిట్ నెంబర్ – 3 వద్ద ఎడమ చేతి వైపు సర్వీస్ రోడ్ ద్వారా రామేశ్వరం బండ దగ్గర గల పార్కింగ్ ప్లేస్ కు చేరుకోవాలన్నారు. హత్నూర, దౌల్తాబాద్ వైపు నుండి కార్లలో మీటింగ్ కు వచ్చేవారు ORR (ఔటర్ రింగ్ రోడ్డు) ఎడమ చేతి వైపు సర్వీస్ రోడ్ ద్వారా రామేశ్వరం బండ దగ్గర గల పార్కింగ్ ప్లేస్ కు చేరుకోవాల్సి ఉంటుందన్నారు. హత్నూర, దౌల్తాబాద్ వైపు నుండి కార్లలో మిటింగ్ కు వచ్చేవారు ORR ( ఔటర్ రింగ్ రోడ్డు ) ఎడమ చేతి వైపు సర్వీస్ రోడ్ ద్వారా రామేశ్వరం బండ దగ్గర గల పార్కింగ్ ప్లేస్ కు చేరుకోవాల్సి ఉంటుందన్నారు.

మీటింగ్ కు వచ్చే బస్సులు తప్ప మరే ఇతర వాహనాలు సుల్తాన్పూర్ ఎగ్జిట్ నెంబర్ -4 వద్ద దిగరాదన్నారు. హైదరాబాద్, లింగం పల్లి మీదుగా మీటింగ్ కు వచ్చే వాహనాలు ఏవి కూడా బీరం గూడ కమాన్ వైపు నుండి కిష్టా రెడ్డి పేట, పటిల్ గూడా వైపు వెళ్లరాదన్నారు. ఎలాంటి వాహనాలు సుల్తాన్పూర్ ఎగ్జిట్ నెంబర్ -4 నుండి ORR (ఔటర్ రింగ్ రోడ్డు) ఎక్కరాదన్నారు. పోచారం కమాన్ నుండి ముత్తంగి ORR (ఔటర్ రింగ్ రోడ్డు) కుడి చేతి వైపు సర్వీస్ రోడ్ లో ఎలాంటి వాహనాలు రావద్దన్నారు. GMR – ఫంక్షన్ హాల్ నుండి APR రోడ్డు ద్వారా పటేల్ గూడాకు వెళ్ళే మార్గంలో ఎలాంటి వాహనాలు రావద్దని, పటాన్ చెరు నుండి ఇంద్రేశం వెళ్ళే వారు ముత్తంగి హరి దోషా వద్ద యు టర్న్ తీసుకొని ORR (ఔటర్ రింగ్ రోడ్డు) ఎడమ చేతి వైపు సర్వీస్ రోడ్ ద్వారా ఇంద్రేశం వెళ్ళవలసి ఉంటుందన్నారు. ఇంద్రేశం గ్రామం నుండి పటాన్ చెరు వెళ్ళే వారి ORR (ఔటర్ రింగ్ రోడ్డు) వద్ద రైట్ టర్న్ తీసుకొని సర్వీస్ రోడ్ గుండా వెళ్ళి NH – 65 ద్వారా పటాన్ చెరు వెళ్ళవలసి ఉంటుందన్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది చదవండి : జిల్లా స్థాయి అధికారులతో సత్తుపల్లి లో సమీక్ష సమావేశం…

రేపు ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయన్నారు. సభా స్థలికి ఐదు‌ కిలో మీటర్ల మేరకు యాంటీ డ్రోన్స్ నిబంధన ఉంటుందన్నారు. మూడంచెల భద్రత తో 2 వేల మంది పోలీస్ సిబ్బందితో భద్రతా చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. స్కూల్ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు. సభా స్థలికి వచ్చే వారు ఎలాంటి వస్తువులు తీసుకురావద్దని, కేవలం మొబైల్స్ మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. క్యూ ఆర్ కోడ్ ద్వారా పార్కింగ్ రూట్ మ్యాప్ ఏర్పాటు చేశామన్నారు.


తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్
తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర …
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బోరు గుంతలో …
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

014235
Total views : 79596

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.