కృష్ణా జిల్లా, పెనమలూరు నియోజకవర్గం, ఉయ్యూరులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆధ్వర్యంలో “జయహో బీసీ” అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. బోడె ప్రసాద్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో జయహో బీసీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. పెనమలూరు నియోజవర్గంలో అన్ని మండలాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మొదటినుంచి టిడిపి పార్టీకి బీసీలు అండగా వున్నారు. మొదటినుంచి బీసీలకు పార్టీ ప్రాధాన్యత ఇచ్చి పదవులు ఇచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే. పార్టీలో నాలుగున్నర సంవత్సరాలు కష్టపడిన కార్యకర్తలకి పదవులు ఇస్తామని అన్నారు. ఇతర పార్టీల వారు ఎవరైనా వస్తే పార్టీలోకి ఆహ్వానిస్తామని టీడీపీ ప్రభుత్వం గెలుపు కోసం కృషి చేయాలని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పెడనలో చేల్లని రూపాయిని పెనమలూరు నియోజకవర్గంలో చెల్లిద్దామని చూస్తున్నాడని విమర్శించారు. బీసీలందరూ ఐకమత్యంగా ఉండి టిడిపి ప్రభుత్వాన్ని గెలిపించాలని బోడె ప్రసాద్ అన్నారు.
Tdp
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న కార్యాలయంలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు. నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన కేశినేని చిన్ని. ఎంపీ కేసినేని నాని పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ కేశినేని చిన్ని. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ.. ఎంపీ కేశినేని నాని దేవినేని అవినాష్ కు ముఖ్య అనుచరుడుగా మారాడు. దేవినేని అవినాష్ ఎటు తిరిగితే ఆయన వెనుక నాని అటు తిరుగుతున్నాడు. కేశినేని నాని వైసీపీలోకి వెళ్లాక ముగ్గురు నలుగురు కూడా నాని వెంట లేరు. కేశినేని నానికి విజయవాడ ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో టిడిపిని ఖాళీ చేయడం కేశినేని నాని వల్ల కాదు. కొడాలి నానిలా బూతులు మాట్లాడుతూ కేశినేని నాని తయారయ్యాడు. మేము గేట్లు తెరిస్తే వరదలా రావడానికి వైసిపి నేతలు సిద్ధంగా ఉన్నారు. దుష్ట పరిపాలన అంతమొందించడమే చంద్రబాబు లక్ష్యం.
చిత్తూరు జిల్లా, కుప్పంలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు. నారా లోకేష్ జన్మదినం సందర్భంగా కుప్పం పట్టణంలో వెలసిన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, కుప్పం నియోజకవర్గ ఇంచార్జి మునిరత్నం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కుప్పం బైపాస్ కూడలిలోని నారా లోకేష్ కటౌట్ పాలాభిషేకం నిర్వహించారు. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం కుప్పం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద అన్న క్యాంటీన్ లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.
వైద్య సేవల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం. డేగల ప్రభాకర్… ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యంపై శ్రద్ద వహించాలని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ అన్నారు. నగరం లో ప్రతి ఆదివారం నిర్వహించే ఉచిత మెడికల్ క్యాంప్ లో భాగంగా ఈ రోజు తూర్పు నియోజకవర్గంలోని శారదకాలని 32 వ లైన్ లో నిర్వహించారు. ఈ క్యాంప్ లో 4 డాక్టర్ల బృందం ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులను పంపిణి చేశారు. ఈ వైద్య శిభిరం లో సుమారు 280 మంది ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ నిజానికి టెక్నాలజీ రోజుల్లో అన్ని సమస్యలకు మందులు ఉన్నప్పటికీ పెద్దపెద్ద రోగాలకు ముందుగా మనం భయపడే తీరు మన రోగాన్ని పెంచుతుందన్నారు. ఇందులో నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబాలు అయితే మరింత దయనీయంగా ప్రతినిత్యం బాధపడుతూన్నారన్నారు. అలంటి వారి కోసం ఉచిత మెగా మెడికల్ క్యాంప్ లు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికి నగరంలో 6 మెడికల్ క్యాంప్ లు నిర్వహించామన్నారు. ఓపిక లేక, ఆసుపత్రికి వెళ్ళి చూపించుకోలేని వృద్ధుల కోసం, ఆర్థిక సంపాదన లేని సామాన్య ప్రజల కోసం, వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నామన్నారు. పేద ప్రజలకు మంచి వైద్యం అందించాలన్నది తమ ఆశయం అన్నారు. ముఖ్యంగా పేద ప్రజలు పెద్దఎత్తున తరలి వచ్చి మెడికల్ క్యాంపు సేవలు సద్వినియోగం చేసుకోవడం చాలా సంతోషముగా ఉందన్నారు. పేద ప్రజలకు అవసరసమైన వైద్య సేవలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందనీ ఆరోపించారు. కేవలం వైద్య పరీక్షలు చేయడం మాత్రమే కాకుండా, వారికి అవసరమైన మందులు కూడా పంపిణీ చేస్తున్నాం అన్నారు. ఈ మెగా మెడికల్ క్యాంపుకు ప్రజల నుండి అనూహ్య స్పందన లభించిందని, పెద్ద సంఖ్యలో రోగులు నిష్ణాతులైన వైద్యుల వద్ద వైద్య చికిత్సలు అందించుకున్నారు. వైసీపీ కేవలం మాటల ప్రభుత్వమని మండిపడ్డారు. ఏ ఒక్క ప్రభుత్వం వైద్యశాలలో కనీస సౌకర్యాలు లేవని, డాక్టర్లు కూడా అందుబాటులో లేరన్నారు. ప్రజలు ఆరోగ్యం పట్ల జగన్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఈ కార్యాక్రమమం లో డాక్టర్ అన్వేష్, డాక్టర్ రాజా, డాక్టర్ గోపి, డాక్టర్ పవన్, చిట్టెం సింధు, మహంకాళి నరసింహారావు, యర్రమల కిరణ్, సౌపాటి రత్నం, మల్లెంపూడి శ్రీను, కొత్తూరి వెంకట్, లింగంగుంట్ల ఆదాం, రాయవరపు బాబురావు, బాజీ మాస్టర్, నిశంకరరావూ అమర్నాధ్, కొండెపు శేఖర్, బండ్లమూడి రాధమ్మ, చౌదరి శ్రీను, కొలగాని సుబ్బారావు, బొక్కిసమ్ శివరామ్, అడపా ప్రసాద్ బాబు, బీరం శ్రీనివాసరావు, షేక్ సుభాని, జనసేన నాయకులూ శ్యాం, కిషోర్, దళవాయి భార్గవ్, వెంకటేశ్వర్లు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తిలో వైసీపీ కార్యకర్తల తాగుబోతు ఆగడాలు. నిన్న రాత్రి ప్రచారంలో ఉన్న బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి రిషిత రెడ్డి పై మాటల దాడి. రిషితా రెడ్డిని ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడిన వైసీపీ నేతలు, ఏర్పడు ఇంచార్జీ కిషోర్, పంపాలి మురళి మోహన్. టీడీపీ ప్రచార రథానికి వైసీపీ ప్రచార రథం అడ్డుపెట్టి రిషితా రెడ్డి ప్రచారాన్ని అడ్డుకున్న వైసీపీ నేతలు. రిషితా రెడ్డిని ప్రచారం చేసుకోకుండా వైసీపీ ప్రచార రథంలో సౌండ్ పెంచిన వైనం. ప్రచార రథం పై ఉన్న బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి ఫోటో ను చించి వేసిన వైసీపీ తాగుబోతులు.
కృష్ణాజిల్లా, మంత్రి జోగి రమేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నిన్నటివరకు పార్థసారథి మాతోనే ఉన్నాడు, ఇప్పటికి వైసీపీ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నాడు. టీడీపీ కండువా ఇంకా కప్పుకోలేదు. నాకు ఏమి హైదరాబాద్ లో వ్యాపారాలు, కాంట్రాక్టులు లేవు. నేను ఉండేది పెనమలూరులోనే. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటాను. నియోజకవర్గంలో 2024లో అత్యధిక మెజారిటీతో వైసీపీ జెండా ఎగరేస్తాం.
ప్రొద్దుటూరులో సామాన్యులు బంగారు, బట్టలు కొనడానికి వస్తే పోలీసులు తనిఖీలు చేసి అధారాల్లేవని డబ్బులు సీజ్ చేయడం వెనుక ఎమ్మెల్యే రాచమల్లు ఉన్నాడని, ఆయనకు తెలిసే ఇవన్నీ జరుగుతున్నాయని ప్రొద్దుటూరు టిడిపి ఇంచార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల కోడ్ ఇంకా అమలు కాకముందే పోలీసులు దాడుల చేస్తూ పెద్ద ఎత్తున నగదు పట్టుకుని ఐటికీ అప్పజెప్పడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఈ దాడులు చేయించేది, ఆపై సానుభూతి ప్రకటించి, ధర్నాలు చేసేది ఎమ్మెల్యేనే అంటూ ఆరోపించారు. పోలీసుల దాడుల వ్యవహారంపై ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించాలని టిడిపి తో కలసి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు రావాలని ప్రవీణ్ రెడ్డి సవాల్ విసిరారు. 30 మద్యం బాటిళ్లు పట్టుకుంటే ఎక్సైజ్ స్టేషన్ కు వెళ్ళి ఎస్ఐని నిలదీసిన ఎమ్మెల్యే 14 లక్షల నగదు కూతురు పెళ్ళి నగల కోసం తీసుకురాగా పట్టుకున్నప్పుడు ఎందుకు పోలీస్టేషన్కు వెళ్లలేదన్నారు. తాను నియమించుకున్న ఇబ్రహీం ఎమ్మెల్యేకి తెలియకుండా ఏదీ చేయడని విమర్శించారు.
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ కోడి కత్తి శ్రీను ను వెంటనే జైలు నుంచి విడుదల చేయాలంటూ టిడిపి ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఒకరోజు ఆమరణ నిరాహార దీక్ష. దీని పై టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం ఎస్సీ అయిన దళిత బిడ్డ కోడి కత్తి శ్రీను ను జైల్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి పైసాచిక ఆనందం పొందుతున్నారు. జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్ల కాలంలో దళితులపై అనేక రకాల దాడులు చేసిన ప్రభుత్వ ఏదైనా ఉందంటే వైసీపీ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి కోర్టుకు సాక్ష్యం చెప్పడానికి వచ్చే సమయం కూడా కేటాయించక పోవడంతో న్యాయస్థానం కూడా ఆలోచన చేయాలి. కోడి కత్తి శ్రీనును జైలు నుంచి విడుదల చేసేంతవరకు మా పోరాటం కొనసాగిస్తాం. ఒక దళిత బిడ్డను ఐదు సంవత్సరాల నుంచి జైల్లో పెట్టడం పూర్తిగా ప్రభుత్వ కుట్ర పూరిత చర్య. న్యాయం కోసం కోడి కత్తి శీను, తల్లి సోదరుడు నిరవదిక దీక్ష చేయడంపై తెలుగుదేశం పార్టీగా మా మద్దతు తెలియజేశాం. జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్దకు తాడేపల్లి ప్యాలెస్ వద్దకు తన బాధను విన్నవించుకుందాం అని వెళ్తే లేడీ కానిస్టేబుల్ తో దుర్భాషలాడి బయటకు గెంటివేశారని విమర్శించారు. ఈరోజు అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణకు వస్తున్న జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ పేరు ఎత్తే అర్హత కూడా జగన్మోహన్ రెడ్డి కి లేదని తెలిపారు.
తెలుగుదేశం పార్టీ రా కదలిరా కార్యక్రమంలో భాగంగా నేడు వెంకటగిరి పట్టణానికి రానున్న టిడిపి అధినేత చంద్రబాబు. ఈ ఉదయం ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా విజయవాడ నుంచి వెంకటగిరి కి రానున్న బాబు. చంద్రబాబు బహిరంగ సభకు సర్వం సిద్ధం చేసిన ఆ పార్టీ శ్రేణులు. తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి భారీగా తరలిరానున్న, టిడిపి, జనసేన పార్టీ శ్రేణులు.
కృష్ణా జిల్లా, గుడివాడ చంద్రబాబు పై ఫైర్ అయిన మాజీ మంత్రి కొడాలి నాని. కోడాలి నాని మాట్లాడుతూ.. నేడు గుడివాడలో టిడిపి వర్ధంతి చేసి, చంద్రబాబు పిండం పెట్టాడు. తనపై, సీఎం జగన్ పై పిచ్చి ఆరోపణలు చేసి, సొల్లు నాయుడు వెళ్ళాడు. సీఎం లుగా వైఎస్ఆర్, జగన్ హయాంలో ఇళ్ల స్థలాలు,నీటి అవసరాలకు 6వందల ఎకరాల భూసేకరణ చేశారు. 14ఏళ్లు సీఎం గా ఉన్న చంద్రబాబు పేదల కోసం ఒక్క ఎకరా సేకరించినట్లు నిరూపిస్తే రాజకీయాలను వదిలేస్తా. ఎన్నికల్లో పోటీ చేయను, మగాడివైతే నా సవాల్ స్వీకరించాలని ఛాలెంజ్ చేసిన కొడాలి నాని. చావటానికైన సిద్ధంగా ఉన్నా. చంద్రబాబు ఉడత ఊపుడికి భయపడను. గుడివాడలో చంద్రబాబు పిచ్చి కబుర్లు ఎవ్వరూ నమ్మరు. నేను గుడివాడ ముద్దు బిడ్డను. నాలుగు సార్లు గెలిచిన చరిత్ర నాది, మరో నాలుగేళ్లు గెలుస్తా. చంద్రబాబు పార్టీని ఎన్ని సార్లు గెలిపించారు. తెలంగాణ లో బూ స్థాపితం చేశాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్నాడు. 5వేల కుర్చీలు వేసి పది నియోజకవర్గాల నుండి మనుషులని రప్పించి చంద్రబాబు ఏం సాధించారు. లోకేష్ కు అడ్డు వస్తాడనే జూ ఎన్టీఆర్ పైకి, బాలయ్యను వదిలాడు. లోకేష్ లాంటి కొడుకు శత్రువుకు కూడా ఉండకూడదు. వైఎస్సార్ కొన్న స్థలంలో, టిడ్కో ఫ్లాట్ల పునాదులు వేసి చంద్రబాబు వదిలేసాడు. కనీసం కాంట్రాక్టర్ కు డబ్బు కూడా చెల్లించలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్లాట్ల నిర్మాణం పూర్తి చేసి. పూర్తి స్థాయి అభివృద్ధి చేసిన లబ్ది దారులకు అప్పగించిన ఘనత సీఎం జగన్ ది. 75ఏళ్లు వచ్చి కూడా చంద్రబాబు పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు. ఎన్టీఆర్ గంజాయి మొక్క అని చెప్పి, సీఎం పదవి దోచుకున్న రోజులను ఎవ్వరూ మర్చిపోరు. కాంగ్రెస్ దగ్గర ఓనమాలు నేర్చుకున్న చంద్రబాబు మా గురించి మాట్లాడటం హాస్యాస్పదం. మరదలిని చంపి, తమ్ముడిని పిచ్చొడిని చేసిన దుర్మార్గుడు చంద్రబాబుకు తన గురించి మాట్లాడే అర్హత లేదు. తనకు బూతుల కోటలో ఎమ్మెల్యే పదవి వస్తే, కోతల కోటాలో చంద్రబాబుకు వచ్చిందా అని ప్రశ్నించారు.