కేంద్రం తీసుకువచ్చిన పాలసీ వల్లే హైదరాబాద్కు అంతర్జాతీయ కంపెనీలు వస్తున్నాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శించారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. కేంద్రం పెట్రోల్ ధరలు తగ్గించినా.. కేసీఆర్ సర్కార్ పెట్రోల్ మీద వ్యాట్ తగ్గించకుండా, బీజేపీపై బురదజల్లే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. 2014లో ఆంధ్రా తెలంగాణ విభజన జరిగినప్పుడు తెలంగాణ వద్ద చాలా సొమ్ము ఉండేదని, అలాంటి రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చిండని విమర్శించారు. తెలంగాణలో ప్రభుత్వానికి రెవెన్యూ తీసుకొచ్చే ప్రాంతం హైదరాబాద్ని, కానీ అలాంటి తెలంగాణను రెవెన్యూ లోటుకు తెచ్చారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఆర్థిక లోటును దాచిపెడుతోందని ఆరోపించారు. దేశంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రంగా తెలంగాణ మారుతోందన్నారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు కేంద్రం కృషి చేస్తున్నదని చెప్పారు.
Tag:
telanaga news
నిరుద్యోగ చైతన్య యాత్ర చెన్నూర్ నియోజకవర్గ కేంద్రానికి చేరుకున్నది.నిరుద్యోగ చైతన్య యాత్ర సభ్యులకు ఘన స్వాగతం పలికారు చెన్నూర్ ప్రజలు. ప్రొఫెసర్ రియాజ్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా మోసం చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి వెంటనే గద్దె దించాలని పిలుపునిచ్చారు.




Total views : 90692