సకల జనుల విజయ సంకల్ప సభా హైదరాబాద్ పాతబస్తీలో గౌళిపుర డివిజన్ బీజేపీ లీడర్ జితేందర్ ఆధ్వర్యం లో సుధ టాకీస్ ఎదురుగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం లో చార్మినార్ నియోజక బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్ధి మేఘ రాణి , బహదూర్ పుర బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్ధి , చంద్రయాన్ గుట్ట బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్ధి కౌడి మహేందర్ ల తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నరు. ఈ కార్య్రమానికి ముఖ్య అతిధి గా అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ విశ్వ శర్మ రావటం విశేషం ఆయనకు స్వాగతం పలికి శాలువా వేసి సన్మానించారు అయన సభా ను ఉద్దేశించి మాట్లాడుతూ తెరాసా , కాంగ్రెస్ మరియు mim అన్ని ఒక్కటే విరు పాతబస్తీ లో అభివృద్ధి పేరుతో దోచుకున్నారు ఈ సారి ఎన్నికలో మాకు అధికారం ఇవ్వండి అభివృద్ధి ఏమిటి అనేది చూపిస్తాను అభివృధి కేవలం బీజేపీ వల్లనే సాధ్యం అవుతుంది తెరాసా పాతబస్తీకి మెట్రో ఇవ్వలేదు వారు మాత్రం ఎదగారు ముస్లిం మహిళలకు తలక్ పేరుతో చేస్తున్న దానిని రద్దు చేసింది బీజేపీ నరేంద్ర మోదిగారు, కాశ్మీర్ లో 370 నీ రద్దు చేసింది బీజేపీ ప్రభుత్వం భారత దేశం ప్రగతి పదం లో నడుస్తున్నది దానికి కారణం బీజేపీ ప్రభుత్వం అస్సాం లో 700 మదరసాలు క్లోజ్ చేసి వాటిని స్కూల్స్ గా మార్చటం జరిగింది దాని వల్ల ఇక ముందు ముస్లిం పిల్లలు డాక్టర్లు , ఇంజినీర్ కావటానికి అవకాశాలు మిన్నగా ఉన్నాయి , ఉద్యోగాలు కల్పించింది బీజేపీ మాత్రమే అని అన్నారు.
telangana elections 2023
నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో కర్ణాటక రాష్ట్రం కోలార్ నియోజకవర్గం ఎమ్మెల్యే మంజునాథ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మిర్యాలగూడ మండలం కొత్తగూడెం గ్రామంలో ప్రచారం నిర్వహించగా కర్ణాటక రాష్ట్ర ఎమ్మెల్యే మంజునాథ్ మాట్లాడుతూ.. మిర్యాలగూడలో బత్తుల లక్ష్మారెడ్డికి ప్రజలు జన నీరాజనం పలుకుతూ కాంగ్రెస్ అంటేనే బిఎల్ఆర్, బిఎల్ఆర్ అంటే కాంగ్రెస్ అనే విధంగా ప్రజల నుండి వస్తున్న స్పందన చూస్తుంటే కచ్చితంగా గెలుస్తామని ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మిర్యాలగూడలో కాంగ్రెస్ జెండా ఎగర వెయ్యాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు అంటూ బిఆర్ఎస్ ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో ఏం సాధించిందో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలలకి ఇచ్చిన హామీలను నెరవేర్చిందని తెలంగాణలో ఆరు పథకాలను ప్రభుత్వం ఏర్పడగానే వెంటనే అమలు చేస్తుందని అన్నారు.
Read Also…
Read Also…
ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు బంజారాహిల్స్ డివిజన్ లో కెసిఆర్ భరోసాని వివరిస్తూ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్, హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రచారం చేశారు. బంజారాహిల్స్ లో జరిగిన అభివృద్ధిని వారు గుర్తు చేస్తూ ఎన్బీటి నగర్ లొ గడపగడపకి ప్రచారం చేశారు. స్థానికంగా ఎలాంటి సమస్యలు లేకుండా ప్రజలెదుర్కొంటున్న పరిష్కారం చేశామని నాగేందర్ అన్నారు. ప్రజలు చెప్పినవే కాకుండా తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యలు లేకుండా చేశానని చెప్పారు. ఈ ప్రచారంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు స్థానిక ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు.
మొండా మార్కెట్ లోని ఇందిరాగాంధీ విగ్రహం ముందు,బన్సీలాల్ పేట్ లో ని రాజీవ్ గాంధీ విగ్రహం ముందు బీఆర్ఎస్ పార్టీ ప్రచార హోర్డింగుల ను నిలిపి ఇందిరాగాంధీ కి అవమానం చేశారని సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోట నీలిమ ఆగ్రహం వ్యక్తం చేశారు. హోర్డింగ్ లు తక్షణమే తీసేసి, అవి పెట్టిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని నీలిమ తో పాటు కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇందిరా గాంధీ విగ్రహం ముందు కు పెద్దఎత్తున చేరుకుని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేశారు.రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ విగ్రహాల వద్ద బిఆర్ఎస్ నాయకుల హోర్డింగ్ లు పెట్టిన వారిపై తక్షణమే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసే వరకు తమ సత్యాగ్రహ ఆందోళన కొనసాగిస్తామని కోట నీలిమ ప్రకటించారు.
ఈ రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి. నియోజకవర్గం దిక్కు చూడనోళ్లు కూడా ఈ ఎన్నికల్లో తమకు ఓటు వేయాలని అడగడం దారుణమన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని అన్నారు సబితా ఇంద్రారెడ్డి. గతంలో అధికారంలో ఉన్న ఏమి చేయని కాంగ్రెస్ పార్టీ ఈరోజు 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నియోజకవర్గంలోని పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలలో ఇల్లు నిర్మించుకోవచ్చు అని, ఎవరో చెప్పే తప్పుడు మాటలు నమ్మొద్దు అంటున్న బీ ఆర్ ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి.
ఈ సారి కూడా బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ ఎస్ కు గతం కంటే ఇంకో రెండు సీట్లు ఎక్కువే వస్తాయన్నారు. ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ కు వచ్చేది 20 సీట్లేనని చెప్పారు.బీఆర్ఎస్ అభ్యర్థి కమల్రాజును గెలిపిస్తే మధిరలో దళితులందరికీ దళితబంధు ఇస్తామని హామీ ఇచ్చారు. ధరణి స్థానంలో భూమాత పెడతారట. వాళ్లు పెట్టేది భూమాత కాదు.. భూమేత అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ను గెలిపిస్తే.. పదేళ్ల నుంచి కొనసాగుతున్న అభివృద్ధి బ్రహ్మాండంగా ముందుకు పోతుందన్నారు. కాంగ్రెస్ నేతలకు రాష్ట్రం గురించి అవగాహనే లేదని ఆయన విమర్శించారు. ఖమ్మం జిల్లాను ఆనుకొని పారుతున్న గోదావరి నుంచి లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథా అవుతున్నాయని, వాటిని ఒడిసి పట్టి ఖమ్మం జిల్లాకు సాగునీరు అందించాలన్న ఆలోచన కాంగ్రెస్ నాయకులకు ఎందుకు రాలేదని కేసీఆర్ ప్రశ్నించారు. భట్టి విక్రమార్క మధిరను పట్టించుకోలేదని, ఆయనకు ఓటేస్తే నష్టమే జరుగుతుందన్నారు. మంచి ప్రణాళికలతో ముందుకెళ్తున్న బీఆర్ఎస్ కు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అసెంబ్లీ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న పోలీస్, పి.ఓ పోలింగ్ అధికారులు, సిబ్బంది తమ ఓటు హక్కు వినియోగించుకొనుటకు జిల్లాలోని 15 నియోజకవర్గాలలో ప్రత్యేక ఫెసిలిటేషన్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జిల్లాలో 15 నియోజకవర్గాలలో ఎన్నికల విధులు నిర్వహించే పి.ఓ లు, ఏ.పి.ఓ లు, ఇతర పోలింగ్ సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ఆయా నియోజకవర్గాల్లో సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఎన్నికల విధులు నిర్వహించనున్న పోలీసు అధి కారికారులు, సిబ్బంది ఆయా నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్ లో ఓటు వేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్ పేట్ తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్ ను పరిశీలించారు. అదే విధంగా కార్వాన్ నియోజకవర్గం గోల్కొండ తహశీల్దార్ కార్యాలయం, చార్మినార్ నియోజకవర్గం మొఘల్ పుర స్పోర్ట్స్ కాంప్లెక్స్, బహదూర్ పుర నియోజకవర్గం బహదూర్ పుర తహశీల్దార్ కార్యాలయం ఫెసిలిటేషన్ సెంటర్ లలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ను పరిశీలించారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో భారాస అభ్యర్థి ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం, రోడ్ షోలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ : 1) కోతల రాయుుడు వచ్చాడు ఒకాయన మాటలు ఎక్కువ పని తక్కువ కరీంనగర్ లో ఓడిపోయి ఇక్కడకు వచ్చాడు 2) హుస్నాబాద్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేశాం 3) గతంలో హుస్నాబాద్ లో కాంగ్రెస్, ఎర్రజెండాల పాలనలో కనీసం బుక్కెడు తాగు నీళ్లకు హుస్నాబాద్ నోచుకోలేదు, నేడు బంగారంల రెండు పంటలు పండుతున్నాయి 4) తెలంగాణాలో కేసీఆర్ మీటర్లు పెట్టలేదని అందుకే 35,000 కోట్లు ఆపామని, నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అన్నారు, 35 వేల కోట్లు ముఖ్యం కాదని రైతులే ముఖ్యమని కేసీఆర్ మీటర్లు పెట్టలేదు 5) కరెంట్ కావాలో, కాంగ్రెస్ కావాలో ప్రజలు ఆలోచించుకోవాలి 6) కర్ణాటకలో 5 గ్యారంటీ లని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో 9 గంటలు వచ్చే కరెంట్ ఇప్పుడు 3 గంటలు కూడా రావట్లేదని, అన్నిటిలో కోతలు విధిస్తున్నారని అక్కడి ప్రజలు ఆవేదన చెందుతున్నారు 7) కాంగ్రెస్ మేనిఫెస్టో కంటే బిఆర్ఎస్ మేనిఫెస్టో నూరు పాల్లు నయం 8) ఎగపెట్టిన చరిత్ర కాంగ్రెస్ ది అమలు చేసిన చరిత్ర బిఆర్ఎస్ ది 9) మూడు గంటల కరంటోడు కాంగ్రెస్ ఓ దిక్కు, మీటర్ల బిజెపొడు ఓ దిక్కు, 24 గంటల ఉచిత కరెంటు కేసిఆర్ ఓ దిక్కు, ఏ దిక్కు ఎటుండాలో ప్రజలు ఆలోచించుకోవాలి 10) హుస్నాబాద్ అభివృద్ధికి తాను బాధ్యత తీసుకుంటా, ప్రజలే హై కమాండ్ గా పనిచేసే పార్టీ బిఆర్ఎస్ పార్టీ
కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డికి నిరసనసగా ఎదురయింది ఎన్నికల ప్రచార కార్యక్రమానికి వెళ్లిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిని రైతులు మరియు 98జీఓ శ్రీశైలం ముంపు నిర్వాసితులు అడ్డుకున్నారు.తమ గ్రామంలోకి రావద్దంటూ రైతులు మరియు 98 జీఓ నిర్వాసితులు నినాదాలు చేశారు. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం వెల్టూరు గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రచారం నిర్వహించేందుకు వెళ్లిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డికి రైతుల నుండి నిరసన సెగ ఎదురయ్యింది.సాగునీరు అందక తమ పంట పొలాలు దాదాపు 5000వేల ఎకరాల పంటలు ఎండిపోయాయని ఎన్నిసార్లు చెప్పిన ఎమ్మెల్యే పట్టించుకోలేదని ఆగ్రహ వ్యక్తం చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు వచ్చిన ఎమ్మెల్యేను రైతులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రైతులు అడ్డుకుంటున్నారన్న నేపథంతో రైతులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో అక్కడ ఉద్రత వాతావరణం నెలకొంది.దీనికి తోడు 98 జీఓ శ్రీశైలం ముంపు నిర్వాసితులు ఎమ్మెల్యే ప్రచారాన్ని అడ్డుకున్నారు. గత ఎన్నికల్లో తనను గెలిపిస్తే 98 జీఓ ద్వార ముంపు నిర్వాసితులకు ఇంటికో ఉద్యోగం అందరికి ఇపిస్తానని చెప్పి ఎమ్మెల్యే బిరం.హర్షవర్ధన్ రెడ్డి తమను మోసం చేశారని ఆరోపిస్తూ ఎమ్మెల్యే ను అడ్డుకున్నారు.






Total views : 194369