ముషీరాబాద్ నియోజకవర్గంలో దోమల గూడ , ఏ.వి. కాలేజ్ నుండి ప్రారంభమైన రోడ్ షో. మహారాష్ట్ర Dy సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, MP, BJP పార్లమెంట్ బోర్డ్ సభ్యుడు, డా K. లక్ష్మణ్ తో కలిసి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముషీరాబాద్ బీజేపీ అభ్యర్థి పూస రాజు తరపున ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గంలో రోడ్ షో లో పాల్గొన్నారు.. ముషీరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పూసరాజు తో పాటు గాంధీ నగర్ కార్పొరేటర్ పావని వినయ్, రామ్ నగర్ కార్పొరేటర్ రవి చారి, కావాడి గూడ కార్పొరేటర్ రచన శ్రీ వెంకటేష్, ముషీరాబాద్ కార్పొరేటర్ సుప్రియ నవీన్ గౌడ్, బిజెపి యువమోర్చా కార్యకర్తలు వేల మంది కార్యకర్తలతో బైక్ ర్యాలీలో భారీ ఎత్తున కార్యకర్తలు బిజెపి పార్టీ సీనియర్ నాయకులు తరలివచ్చారు.. బిజెపి నినాదంతో దద్దరిల్లిపోయిన ముషీరాబాద్ రోడ్లు.
telangana elections 2023
కాంగ్రెస్, బీజేపీ లు గాలి కబుర్లు చెప్తూ ప్రజలను తప్పు దారి పట్టిస్తున్నారు – దానం నాగేందర్
ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అన్ని పార్టీల అభ్యర్ధులు ఇంటింట ప్రచారాన్నితీవ్రం చేశారు. ప్రచారంలో అధికార బిఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి దానం నాగేందర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రతీ కాలనీలోనూ బస్తిలోనూ ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. కాంగ్రెస్, బిజెపిలు గాలి కబుర్లు చెప్తూ తప్పుదారి పట్టిస్తున్నాయంటున్న దానం నాగేందర్.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయినా రావాల్సినంత ప్రజాస్వామ్య పరిణతి రాలేదనీ ప్రజాస్వామ్య పరిణతి వచ్చినప్పుడే ప్రజలకు మేలు జరుగుతదనీ, విచక్షణతోటి బాగా ఆలోచించి మంచి అభ్యర్థికి, మంచి పార్టీకి ఓటెయ్యాలి. కాంగ్రెస్ మాయ మాటలు నమ్మి ఆషామాషీగా ఓటు వేయొద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్ అన్నారు. నందిగామ మండలం మామిడిపల్లి, శ్రీనివాసుల గూడ, మొదళ్ళ గూడ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్ కు ఆయా గ్రామాల్లో ప్రజల నుండి భారీ స్పందన లభించింది. స్ధానిక నేత మాజీ జెడ్పి వైస్ చైర్మన్ నాగర్ కుంట నవీన్ రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో టిఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సంధర్భంగా ఎమ్మేల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ.. ఏ పార్టీకి ఓటేస్తే మంచి జరుగుతది.. ఏ పార్టీకి ఓటేస్తే చెడు జరుగుతది..? అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయగలగాలనీ, ప్రజలకు ఉన్న ఒకే ఆయుధం ఓటు. ఆ ఓటును సక్రమంగా వినియోగించుకోవాలె’ అని అంజయ్య చెప్పారు. ‘పార్టీల చరిత్ర, నడవడిక చూసి ఓటు వేయాలె. బీఆర్ఎస్ పార్టీ చరిత్ర ఏందో మీకు తెలుసు. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం. తెలంగాణ అభివృద్ధి కోసం. తెలంగాణ ఏర్పాటైనంక బీఆర్ఎస్ పార్టీ ఎంత బాగా అభివృద్ధి చేసిందో మీరందరూ చూస్తున్నరు. మరె 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది..? అడుగడుగునా తెలంగాణను మోసం చేసింది. కాంగ్రెస్ పాలనలో ఎక్కడ చూసిన కరువు కాటకాలే ఉండె. పత్తికాయలు పగిలినట్లు రైతులు గుండెలు పగిలి చనిపోయిండ్రు. అదీ కాంగ్రెస్ పరిపాలన’ అని అంజయ్య ఎద్దేవా చేశారు
పుట్టిన బిడ్డ తల్లి చేతిలో ఉంటే ఎంత భద్రంగా ఉంటదో, తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ చేతులో ఉంటే అంతే భద్రంగా ఉంటుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు మహేశ్వరం నియోజకవర్గం లోని సరస్వతి గూడ, అగర్మియా గూడ, లేమూర్, తిమ్మాపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంత్రి మాట్లాడుతూ చుట్టం చూపులాగా ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు. నియోజకవర్గ ప్రకారంగా ఎలాంటి అవగాహన లేని వాళ్ళు నియోజకవర్గంలో తిరుగుతున్నారు .ఒకరేమో డబ్బుల సంచులు మోసుకొని తిరుగుతున్నారు, ఒకరేమో కులమతాలను రెచ్చగొట్టి రాజకీయం చేయాలని చెప్పి తిరుగుతున్నారు.గడచిన తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఎలాంటి కులమతాల మధ్య చిచ్చు లేకుండా, తెలంగాణను సస్యశ్యామలంగా చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు,టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు,ఎంపీటీసీలు, సర్పంచులు,వార్డు సభ్యులు అనుబంధ సంఘాల అధ్యక్షులు,మహిళా నాయకురాళ్ళు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ ప్రాంత బిడ్డ గా నాకు ఒక్కసారి అవకాశమిస్తే ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తాననన్నారు బీజేపీ అభ్యర్థి చలమల్ల కృష్ణా రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండ జిల్లా చండూరు మండలం బోడంగిపర్తి, తాస్కాన్ గూడెం, శిరిదేపల్లి గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. కోలాటాలతో ఘన స్వాగతం పలికారు మహిళలు బిజెపి శ్రేణులు. ఈ సందర్భంగా చలమల్ల కృష్ణా రెడ్డి మాట్లాడుతూ. రాజగోపాల్ రెడ్డి లాగా నేను కాంట్రాక్ట్ ల కోసం రాజకీయాలు చేయడం లేదన్నారు, ఎమ్మెల్యేగా ,ఎమ్మెల్సీగా ఉండి. ఈ ప్రాంతానికి ఆయన చేసిన అభివృద్ధిని ఏమి లేదనీ, ఆయన్ని గెలిపిస్తే మళ్ళీ మనకు దొరకడని అన్నారు. కూసుకుంట్ల ఒక అసమర్ధ ఎమ్మెల్యే అని, ఆయనకు మాట్లాడే ధైర్యం లేదని, ఆయన సేవలిక చాలని అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీని ప్రజలు విస్మరించారని ఈ నెల జరిగే 30న ఎన్నికల్లో బిజెపి పార్టీ 20,000 మెజార్టీతో కషాయం జండా ఎగర పోతుందన్నారు. ఈ ప్రాంతంలో పుట్టిన వ్యక్తిగా ఈ ప్రాంత అభివృద్ధి చేయడమే తన ఏకైక లక్ష్యం అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో ప్రతి గ్రామంలో బీటీ రోడ్లు, పేద ప్రజలకు రేషన్ కార్డ్స్, పెన్షన్స్, ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు, ఇల్లు లేని ప్రతి ఒక్క నిరుపేదకు ఇంటి స్థలంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు ఇప్పిస్తామన్నారు. మునుగోడు గడ్డమీద కాషాయం జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
మేడ్చల్ నియోజకవర్గం లో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న మంత్రి మల్లారెడ్డి , ఘట్కేసర్ మండల పరిధి పోచారంలో నిర్వహించిన రోడ్ షో కు భారీగా తరలివచ్చిన జనం. అభివృద్దికే జనం పట్టంకడతారని , కేసిఆర్ వైపు జనం ఉన్నారని , పదేళ్ల కాలంలో అభివృద్ది వైపు అడుగులు వేస్తూ, ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి ధ్యేయంగా కేసిఆర్ నిరంతరం కృషి చేస్తున్నాడని మంత్రి మల్లారెడ్డి గుర్తు చేశారు. అత్తలేని పత్తాలేని కాంగ్రెస్, బిజెపి, పార్టీలు..కాంగ్రెస్ అంటే స్కాంలు తప్ప, స్కీము లేవంటూ మంత్రి మల్లారెడ్డి, ఇసుక పడ్డాడు..కాంగ్రెస్ పార్టీకే గ్యారంటీ లేదని, మరి కాంగ్రెస్ చెప్పే గ్యారంటీలు ఉంటాయా అని ఎద్దేవా చేశారు..
మూడవసారి BRS జెండా ఎగురవేసి , ప్రజల అభివృధి లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు
మహేశ్వరం బీజెపి పార్టీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ సరూర్ నగర్ డివిజన్ లో పార్టీ నాయకుల తో కలసి విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. బీజేపీ పార్టీకి ఓటు వేసి గెలిపించలి అని ప్రజలను కోరారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని అందెల శ్రీరాములు ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకంలో కేంద్రం వాటా ఉందని అందెల శ్రీరాములు తెలిపారు. దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి పథకం అంటూ అన్ని రకాలుగా తెలంగాణ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. లోకల్ వ్యక్తిగా, మహేశ్వరం నియోజకవర్గం లో సమస్యలు తెలిసిన వ్యక్తిగా ప్రజలు ఆదరిస్తున్నారని శ్రీరాములు అన్నారు
రానున్న ఎన్నికల పోరులో దొరల తెలంగాణకు ప్రజల తెలంగాణకు పోరు జరగబోతున్నదని ఈ పోరులో ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం మోటమర్రి, కలకోట ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే మాయ మాటలు చెప్పి బీఆర్ఎస్ పాలకులు అధికారంలోకి వచ్చి రాష్ట్ర సంపదను దోచుకోవడం వల్ల ప్రజలకు సంపద అందకుండా పోయిందని ఆయన ఆరోపించారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర సంపదను ప్రజలకు పంచుతామన్నారు .ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామన్నారు అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు.
కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెండు ఒక్కటే నని బిజెపి అభ్యర్థి బండి సంజయ్ ని గెలిపించేందుకే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని..కరీంనగర్ బారసా అసెంబ్లీ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.. ఆదివారం హుస్సేన్ పుర నేషనల్ ప్యాలస్ లో ముస్లీం సోదరుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హోమ్ మినిస్టర్ మెహమూద్ అలీ, ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ మంత్రి గంగుల కమలాకర్ హాజరైనారు..
ఈ సందర్బంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ సమైక్య పాలనలో ఎక్కడ చుసిన గొడవలు, శాంతి భద్రతల సమస్యలు 144 సెక్షన్ లులాఠీఛార్జి లు ఉండేవని అన్నారు.. రాజకీయ అవసరాల కోసం హిందూ ముస్లిం ల మధ్య గొడవలు పెట్టి లబ్ది పొందే వారని అన్నారు.. బయటకు వెళ్లిన పిల్లలు ఇంటికి వచ్చేవరకు తల్లిదండ్రులు భయం భయంగా గడిపే వారని…తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకహిందూ ముస్లింలు ఒకటై కలిసిమెలిసి జీవిస్తున్నారని అన్నారు.. కెసిఆర్ హయంలో కడుపునిండా తిని కంటి నిండా నిద్రపోతున్నారని గుర్తు చేశారు.. శాంతిభద్రతలు అదుపులో ఉన్నప్పుడే పెద్దపెద్ద కంపెనీలో తరలివస్తాయని.. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని అన్నారు.. రానున్న ఎన్నికల్లో సెక్యులర్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు.. తెచ్చుకున్న తెలంగాణ కెసిఆర్ చేతుల్లోనే భద్రంగా ఉంటుందని వెల్లడించారు.. కానీ ప్రతిపక్షాలు వేస్తే కరెంటు నీళ్లు తెలంగాణ సంపదనను దోచుకుంటారని..కరీంనగర్ ప్రజలు ఒకసారి ఆలోచించాలని… అభివృద్ధిని చూసి మరోసారి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ని ఆశీర్వదించాలని అన్నారు..కారు గుర్తుకు ఓటేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు..
రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం నియోజకవర్గ, కందుకూరు మండలం…..
కేఎల్ఆర్ కు కందుకూరు మండలంలో బ్రహ్మరథం పట్టిన ప్రజలు కేఎల్ఆర్ కి మా ఓటు అంటున్న గ్రామ ప్రజలు, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలంలో, కొత్తూరు, గపూర్ నగర్, కొత్తగూడా, జైత్వరం, పులిమామిడి, దన్నారం, చిప్పలపల్లి ,మురళి నగర్ ,పెద్దమ్మ తండా ,దావూద్ గూడా తండా ,బాచుపల్లి, నేదునూరు ,దాసర్లపల్లి ,గ్రామాలలో కేఎల్ఆర్ రోడ్ షో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కె.ఎల్.ఆర్ కి ప్రతి గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రజలందరూ బ్రహ్మరథం పట్టారు పెద్ద ఎత్తున వివిధ గ్రామాల నుండి కే ఎల్ ఆర్ కి ఘన స్వాగతం లభించింది కేఎల్ఆర్ కి అధిక మెజార్టీతో గెలిపిస్తామని గ్రామస్తులు మాటఇవ్వడం జరిగింది మరియు నేదునూరు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నుండి ముఖ్య నేతలతో పాటు 300 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అదేవిధంగా కందుకూరు మండలం మిర్ఖాన్పేట్ గ్రామం నుండి 500 మంది బిజెపి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది






Total views : 194369