Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Telangana సెక్యులర్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి – మంత్రి గంగుల కమలాకర్

సెక్యులర్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి – మంత్రి గంగుల కమలాకర్

by Prakash
gangula kamalakar about brs party.

కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెండు ఒక్కటే నని బిజెపి అభ్యర్థి బండి సంజయ్ ని గెలిపించేందుకే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని..కరీంనగర్ బారసా అసెంబ్లీ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.. ఆదివారం హుస్సేన్ పుర నేషనల్ ప్యాలస్ లో ముస్లీం సోదరుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హోమ్ మినిస్టర్ మెహమూద్ అలీ, ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ మంత్రి గంగుల కమలాకర్ హాజరైనారు..

ఈ సందర్బంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ సమైక్య పాలనలో ఎక్కడ చుసిన గొడవలు, శాంతి భద్రతల సమస్యలు 144 సెక్షన్ లులాఠీఛార్జి లు ఉండేవని అన్నారు.. రాజకీయ అవసరాల కోసం హిందూ ముస్లిం ల మధ్య గొడవలు పెట్టి లబ్ది పొందే వారని అన్నారు.. బయటకు వెళ్లిన పిల్లలు ఇంటికి వచ్చేవరకు తల్లిదండ్రులు భయం భయంగా గడిపే వారని…తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకహిందూ ముస్లింలు ఒకటై కలిసిమెలిసి జీవిస్తున్నారని అన్నారు.. కెసిఆర్ హయంలో కడుపునిండా తిని కంటి నిండా నిద్రపోతున్నారని గుర్తు చేశారు.. శాంతిభద్రతలు అదుపులో ఉన్నప్పుడే పెద్దపెద్ద కంపెనీలో తరలివస్తాయని.. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని అన్నారు.. రానున్న ఎన్నికల్లో సెక్యులర్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు.. తెచ్చుకున్న తెలంగాణ కెసిఆర్ చేతుల్లోనే భద్రంగా ఉంటుందని వెల్లడించారు.. కానీ ప్రతిపక్షాలు వేస్తే కరెంటు నీళ్లు తెలంగాణ సంపదనను దోచుకుంటారని..కరీంనగర్ ప్రజలు ఒకసారి ఆలోచించాలని… అభివృద్ధిని చూసి మరోసారి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ని ఆశీర్వదించాలని అన్నారు..కారు గుర్తుకు ఓటేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు..

Advertisements

You may also like

Our Visitor

014155
Total views : 79228

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.