నెల్లూరు జిల్లా, ఉదయగిరి బెల్ట్ దుకాణాలపై పోలీసులు దాడులు. ఉదయగిరి పట్టణంలోని గండిపాలెం మార్గం వైపు ఉన్న పెట్రోల్ బంక్ ఎదురుగా అనుమతి లేకుండా బెల్ట్ దుకాణాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 51 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ఇంద్రసేనా రెడ్డి తెలిపారు. మద్యం విక్రయిస్తున్న ఇద్దరు మహిళలు కూడా అదుపులో తీసుకున్నారు.
Telugu News
కాకినాడ జిల్లా, అంగన్వాడీల పై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రకటించిన మేము భయపడేది లేదు ఆనాడు తమిళనాడు ప్రభుత్వం ఎస్మా ప్రకటించింది ఆ ప్రభుత్వం కనుమరుగయ్యింది. త్వరలో జగన్మోహన్ రెడ్డి అదే పరిస్థితి ఎదుర్కొంటాడు. కాకినాడ కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ లు నైట్ కూడా దిక్షలు నిర్వహించారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్షలకు దిగుతాం అని ప్రభుత్వానికి అంగన్వాడీ లు హెచ్చరిస్తున్నారు.
భార్యతో కలిసి కన్న తల్లిని హత్య చేసిన దుర్మార్గుడు. బంధువులకు అనుమానం రావడంతో బయటపడిన విషయం. ఆస్తి అమ్మడానికి అడ్డు వస్తుందని కన్నతల్లినే భార్యతో కలిసి మట్టు పెట్టాడు ఓ కిరాతకుడు. ఈ సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతపూర్ వెంకట్ రెడ్డి నగర్ లో ఆలస్యంగా వెలుగు చూసింది.
వెంకట్ రెడ్డి నగర్ ప్రాంతానికి చెందిన కసావేణి సుగుణమ్మ భర్త కొన్నాళ్ల క్రితం చనిపోయాడు ఆమెకు కుమారుడు అనిల్ ,కోడలు తిరుమల ఉన్నారు
వీరి ఇద్దరు పిల్లలు హాస్టల్లో చదువుకుంటున్నారు, భర్త చనిపోయిన తర్వాత ఇంటిని సుగుణమ్మ తన పేరు మీదకు మార్చుకుంది కొడుకు జులాయి గా తిరగడంతో అప్పులు పెరిగాయి, అప్పులు తీర్చేందుకు ఇల్లు అమ్మాలని కొడుకు, కోడలు కొంతకాలంగా సుగుణమ్మ పై ఒత్తిడి చేస్తున్నారు అయితే సుగుణమ్మ ససేమీరా అనడంతో కోడలుతిరుమల పుట్టింటికి వెళ్ళింది ఇల్లు అమ్మాలంటే ఎలాగైనా తల్లి అడ్డు తొలగించుకోవాలని అనిల్ నిర్ణయించుకున్నాడు ఈ నెల నాలుగవ తేదీ అర్ధరాత్రి తిరుమల మరో వ్యక్తి శివతో కలిసి వెంకటరెడ్డి నగర్ వచ్చింది అదే రాత్రి సుగుణమ్మ అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు, అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్రలో ఉన్న సుగుణమ్మ ముఖంపై దిండు అదిమి గొంతు చుట్టి హత్య చేశారు అమ్మ నిద్రలోనే చనిపోయిందని అనిల్ బంధువులతో బుకాయించారు. మృతదేహంపై గాయాలు ఉండడంతో బయటపడ్డ అసలు నిజం. మరణ వార్త విని సుగుణమ్మ తల్లి దాసరి ఐలమ్మ సహా బంధువులు వరంగల్ ప్రాంతం నుంచి భారీగా తరలివచ్చారు 5వ తేదీన అంత్యక్రియలకు సన్న హాలు చేశారు సుగుణమ్మ మృతదేహానికి స్నానం చేయిస్తుండగా మెడమీద గాయాలు కనిపించాయి దీంతో అనుమానం వచ్చి బంధువులు అనీలు నిలదీయగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు దీంతో పోలీసులు కొడుకు, కోడలిని అదుపులోకి తీసుకొని విచారించడంతో విషయం బయటపడింది. ఆస్తి కోసం అమ్మను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుని భార్య ఆమెతో వచ్చిన శివతో కలిసి హత్య చేసినట్లు అనిల్ పోలీసులకు తెలిపాడు దీంతో ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.
నెల్లూరు జిల్లా, గుడ్లూరు (మం) మాచర్ల వద్ద జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం. లారీని ఢీ కొట్టిన TSRTC బస్సు ఒకరు మృతి, 7గురి పరిస్థితి విషమం. మృతి చెందిన వ్యక్తి బస్ డ్రైవర్ వినోద్ గా గుర్తింపు. మిర్యాలగూడ నుండి తిరుపతి వెళ్తున్న TSRTC బస్సు. క్షతగాత్రులను కావలి ఏరియా వైద్యశాల లో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలింపు. ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్న పోలీసులు.
తిరుపతి, ఉమ్మడి నెల్లూరు జిల్లా, గూడూరు జిల్లాలో పలుచోట్ల ఉద్రిక్తత అర్ధరాత్రి మున్సిపల్ కార్మికుల బైటాయింపు. కార్మికులు సమ్మెలో ఉండగా పర్మనెంట్, ప్రైవేట్ కార్మికులతో అర్ధరాత్రి చెత్త తీపిస్తున్న అధికారులు. అడ్డుకున్న మున్సిపల్ పారిశుధ్య ఔట్ సోర్సింగ్ సిబ్బంది. అధికారులు, పోలీసులుతో పారిశుద్ధ్య కార్మికుల వాగ్వాదం. నెల్లూరు నగరంలోనూ ఇదే పరిస్థితి. రోజు రోజుకూ ఉధృతం అవుతున్న కార్మికుల సమ్మె.
కాకినాడ జిల్లా, రూరల్, ప్రభుత్వం పెంచిన 3000 రూపాయల పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని కాకినాడ మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో ఎం.పి.డి.ఓ కే.స్వప్న అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు హాజరయ్యారు. ప్రభుత్వం పెంచిన పెన్షన్ లను లబ్ధిదారులకు కన్నబాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత నుండి పెన్షన్ డబ్బులు నేరుగా ఇంటికే అందేలా ఆలోచించిన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో 65 సంవత్సరాలు నిండిన వారికే పెన్షన్లు ఇచ్చేవారు. పెద ప్రజల కష్టాలు చూసిన జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి నెల 1వ తేదీ ఉదయాన్నే వాలంటీర్ వచ్చి లబ్ధిదారులకు అందజేసి దేశం లో చాలా రాష్ట్రాలకు ఆదర్శంగా పాలన సాగిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. దేశం లో ఏ రాష్ట్రం లో ఇవ్వని విధంగా 3000 రూపాయలు పెన్షన్ లు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని, కులం, మతం, ఏ రాజకీయ పార్టీ కి మద్దతు ఇచ్చారు అని చూడకుండా అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇస్తున్న దమ్మున నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో డి.ఎల్.డి.ఓ పట్టంసెట్టి నారాయణ మూర్తి, ఎం.పి.పి గోపిసెట్టి పద్మజ బాబ్జీ, జెడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ, తిమ్మపురం గ్రామ సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
రాజమహేంద్రవరం, గైట్ కాలేజీలో అంగరగవైభవంగా ప్రారంభమైన 2వ అంతర్జాతీయ తెలుగు మహాసభలు. తెలుగు పండుగలా సందడిగా మారిన గైట్ కాలేజీ ఆవరణ. చైతన్య విద్యాసంస్థలు అధినేత చైతన్య రాజు, ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు గజల్ శ్రీనివాస్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహణ. శ్రీశ్రీ రాజ రాజ నరేంద్రుల పట్టాభిషేక సహస్రాబ్ది నీరాజనంగా తెలుగు మహాసభలు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అతిధులు, ప్రతినిధులు. విశాఖ శారదా పీఠం శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర మహాస్వామి వారి దివ్య ఆశీస్సులతో తెలుగు మహాసభల అంకురార్పణ కార్యక్రమం. మహాసభల ప్రారంభోత్సవ సభ వేదికకు రాజరాజ నరేంద్ర వేదికగా నామకరణం. మొదలైన సాంస్కృతిక కార్యక్రమాలు. తొలిరోజు ముఖ్యఅతిథిగా హాజరు కానున్న రాష్ట్ర గవర్నర్ , న్యాయమూర్తులు, పలువురు రాష్ట్ర మంత్రులు, సాహిత్య ప్రముఖులు, ప్రతినిధులు.
ఎల్బీనగర్, రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులు మృతి. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌరెల్లి రోడ్డు వద్ద పాపన్న గూడ చౌరస్తాలో టిప్పర్ లారీ బైక్ ఢీ కొని కుత్బుల్లాపూర్ కి చెందిన తండ్రి కొడుకులు మృతి. నాగోల్ పీఎస్ పరిధి కుత్బుల్లాపూర్ కి చెందిన కుతాడి కుమార్ (40) , 7వ తరగతి చదువుతున్న కొడుకు కుతాడి ప్రదీప్ (13) టిప్పర్ ఢీకొని తండ్రి కొడుకులు ఇద్దరు మృతి. పరారీ లో టిప్పర్ డ్రైవర్. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న నాగోల్ పోలీసులు.
ఎన్టీఆర్ జిల్లా, పెనుగంచిప్రోలు మండలం, అనిగండ్లపాడులో ఉద్రిక్తత. సీఐ సమక్షంలోనే అనుమానిత వ్యక్తి పై గ్రామస్థుల దాడి. గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సర్పంచ్ జ్యోతికి చెందిన లారీకి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన ఘటనపై స్థానికుల ఆందోళనకు దిగారు. పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. అనుమానంతో బోశెట్టి త్రినాథ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. అతడిని కారులో ఎక్కించుకొని వెళ్తుండగా అడ్డగించిన గ్రామస్తులు. పోలీసులు వినియోగించిన ఆ ప్రైవేటు కారును ధ్వంసం చేసి. సీఐ, ఎస్సై సమక్షంలోనే త్రినాధ్ పై స్థానికులు దాడి. గ్రామానికి చెందిన బోశెట్టి త్రినాథ్, మరో ఇద్దరు కలిసి తన లారీని దగ్ధం చేశారని సర్పంచ్ జ్యోతి దంపతులు ఆరోపిస్తున్నారు. గత కొంతకాలంగా ఆ 3 వ్యక్తులు గ్రామంలో అలజడి సృష్టిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారన్నారు. గతంలో తమకు చెందిన వరి కోత యంత్రాన్ని కూడా ధ్వంసం చేశారని, ఆ విషయంపై పోలీసులకు ఫిర్యాదులు చేసినా సరిగా పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పటికైనా పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
పల్నాడు జిల్లా, దాచేపల్లి ఆర్ అండ్ బి బంగ్లా సెంటర్లో మున్సిపల్ కార్మికులకు పోలీసులకు మధ్య వివాదం నెలకొంది. మున్సిపల్ కార్మికులు సమ్మెలో భాగంగా కార్మికులు రోజు సమ్మె చేస్తున్న తరుణంలో ఈరోజు మున్సిపల్ శాఖ అధికారులు వేరే వారి ద్వారా పారిశుద్ధ పనులు చేయించాలని చూడటంతో వారిని అడ్డుకున్న కార్మికులు. రంగ ప్రవేశం చేసిన దాచేపల్లి పోలీసులు. కార్మికులకు పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బలవంతంగా స్టేషన్ కు తరలించేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు, ట్రాక్టర్ ముందు బైఠాయించి నిరసన తెలియజేస్తున్న కార్మికులు.



Total views : 92451