ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను చంపుతామంటూ బెదిరింపులు కాల్స్ చేసిన అగంతకుడిని విజయవాడ కృష్ణలంక పోలీసులు గుర్తించారు. నిందితుడు లబ్బిపేట వాటర్ ట్యాంక్ రోడ్లో ఉంటున్న మల్లికార్జున్గా పోలీసులు నిర్ధారించారు. డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఫోన్ నంబర్ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. సైబర్ క్రైమ్ పోలీసులు సెల్ ఫోన్ ట్రాక్ చేయగా లబ్బిపేట నుంచి కాల్స్, మెసేజ్లు వచ్చినట్లు గుర్తించారు. అనంతరం స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. అయితే పోలీసులు లబ్బిపేటకి వెళ్లే సరికే నిందితుడు మల్లికార్జున్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించిన నిందితుడి కోసం గాలించిన పోలీసులు ఎట్టకేలకు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే గతంలో హోంమంత్రి అనితకు సైతం ఇదే నంబర్ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కాగా, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను చంపేస్తానంటూ ఆయన పేషీకి మల్లికార్జున్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. పవన్ను చంపేస్తానంటూ అతను బెదిరింపులకు దిగాడు. ఉప ముఖ్యమంత్రిని అభ్యంతకర భాషతో హెచ్చరిస్తూ పలు మెసేజ్లు పంపించాడు. అప్రమత్తమైన సిబ్బంది ఈ విషయాన్ని వెంటనే డిప్యూటీ సీఎంకు తెలియజేశారు. దీనిపై స్పందించిన ఆయన.. బెదిరింపులకు సంబంధించిన వివరాలను పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటన గురించి హోంమంత్రి వంగలపూడి అనితకు తెలియగా.. ఆమె వెంటనే డీజీపీకి ఫోన్ చేశారు. నిందితుడి ఫోన్ నంబర్ సహా పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు.
అయితే అగంతకుడు రెండు సార్లు ఫోన్ చేశాడని, పలు మెసేజ్లు పంపించాడని హోంమంత్రి అనితకు డీజీపీ తెలిపారు. నిందితుడిని వెంటనే పట్టుకోవాలని అనిత ఆదేశాలు జారీ చేశారు. దీంతో స్పెషల్ టీమ్లు రంగంలోకి దిగాయి. నిందితుడి కాల్స్ చేసిన ఫోన్ నంబర్ ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనంతరం ఫోన్ సిగ్నల్స్ విజయవాడ లబ్బిపేట నుంచి వస్తున్నట్లు గుర్తించారు. ఆ నంబర్ మల్లికార్జున్ అనే వ్యక్తి పేరు మీద ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కాగా, మల్లికార్జున్ ఎవరు, ఎందుకు బెదిరింపులకు దిగాడు, అతని వెనక ఎవరైనా ఉన్నారా? ఎవరు చేప్తే చేశాడు వంటి విషయాలు విచారణలో తెలియనున్నాయి.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 91040