బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని అన్నారు మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత విజయశాంతి. సీఎం కేసీఆర్ అవినీతిపై ఆధారాలున్న ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రధాని మోదీని ప్రశ్నించారు. ఆ పార్టీలు తెర ముందు విమర్శలు, తెర వెనక ఒప్పందాలు చేసుకున్నాయని ఆరోపించారు. మధ్యలో బీజేపీ కార్యకర్తలు, ప్రజలు పిచ్చోళ్లని అన్నారు. కేసీఆర్ సూచన మేరకే బీజేపీ అధ్యక్షుడి మార్పు జరిగిందని ఆరోపించారు. అందుకే తాను బీజేపీకి రాజీనామా చేశానని చెప్పారు విజయశాంతి. తన రాష్ట్రమే తనకు ముఖ్యమని అనుకోని రాజకీయాల్లో ఉన్నానని అన్నారు విజయశాంతి. ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డా తెలంగాణకు వచ్చినప్పుడు విమర్శలు చేయడం వదిలేయడం ఇదో తంతుగా మారిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పిన విజయశాంతి కేసీఆర్ అవినీతిని కక్కిస్తుందన్నారు. కాంగ్రెస్ లో తన పాత మిత్రులను కలుసుకోవడం అనందంగా ఉందన్నారు. బీఆర్ఎస్ ను గద్దెదించే పార్టీతోనే తాను నడుస్తానన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో అధికార మార్పు జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
Tag:
Vijayashanti
తెలంగాణాలో రేపు ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. పినపాక, పరకాల, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్ ,రాజేంద్ర నగర్ లలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అదేవిధంగా రేపు మధ్యాహ్నం టీ కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో ను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విడుదల చేయనున్నారు. ఆ తర్వాత కుత్బుల్లాపూర్ ఎన్నికల ప్రచారం లో ఖర్గే పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. అదేవిధంగా సినీ నటి, బిజెపి నాయకురాలు విజయశాంతి ఖర్గే సమక్షంలో పార్టీలో చేరనుంది. విజయశాంతికి మెదక్ ఎంపీ స్థానం తో పాటు సముచిత గౌరవం ఇస్తామని కాంగ్రెస్ అగ్రనేతలు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.





Total views : 141690