వరంగల్ జిల్లాలో మళ్ళీ నకిలీ విత్తనాల దందా జోరుగా కొనసాగుతోంది. గతంలో నకిలీ విత్తనాలపై వరుస కథనాలు ప్రసారం చేసి ఉమ్మడి జిల్లాలో 15 ఫెర్టిలైజర్ షాప్స్ సీజ్ చేయించిన సీవీఆర్ న్యూస్తా జాగా నర్సంపేటలో నకిలీ విత్తనాల దందా బాగోతం బయటపడింది. మంగళ సీడ్ MTU 1224 రకం విత్తనాలను రైతులు కొనుగోలు చేశారు. పట్టణంలోని బాలాజీ కిసాన్ ఫెర్టిలైజర్ షాప్ లో విత్తనాలను కొనుగోలు చేసినట్టు రైతులు తెలిపారు. సరైన సమయంలో విత్తనాలు ఫీడింగ్ రాలేదని షాపు యజమాని పై రైతుల ఆగ్రహించారు. షాప్ కు తాళం వేసి ఆందోళన నిర్వహించారు.
warangal
కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రమంత్రులు, బీజేపీ అగ్రనేతలు తెలంగాణలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అమిత్ షా తెలంగాణకు రానున్నారు. సోమాజిగూడలోని బీజేపీ మీడియా సెంటర్లో తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తారు. ఆ తర్వాత నల్గొండ, వరంగల్, గద్వాల, రాజేంద్రనగర్లలో నిర్వహించే సభలలో పాల్గొంటారు. ఈ మేరకు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అమిత్ షా 17న తెలంగాణలో పర్యటించాల్సి ఉంది. అయితే 18కి వాయిదా పడింది.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అగ్రనేతలు తెలంగాణలో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 17న తెలంగాణలో పర్యటించనున్నారు. ఆ రోజున ఆయన మూడు బహిరంగ సభలలో పాల్గొంటారు. పాలకుర్తి, వరంగల్, భువనగిరిలలో నిర్వహించనున్న బహిరంగ సభలలో రాహుల్ గాంధీ పాల్గొంటారని ఆ పార్టీ తెలిపింది. రాహుల్ గాంధీ తెలంగాణలో వివిధ తేదీలలో మొత్తం ఆరు రోజుల పాటు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఆ పార్టీ వెల్లడించింది. ఒకేరోజు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఒకటి రెండు రోజుల్లో ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే పర్యటనల తేదీలను పార్టీ ఖరారు చేయనున్నట్లు చెబుతున్నారు. దాదాపు ప్రతి నియోజకవర్గంలో పార్టీల అగ్రనేతల పర్యటనలు ఉండేలా చూస్తున్నారు.
జనగామ జిల్లా, నవంబర్ 7, మంగళవారం, జనగామ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి. కుటుంబం సభ్యులతో కలిసి బిఆర్ఎస్ అభ్యర్థి పళ్ళ రాజేశ్వర్ రెడ్డి 2 నామినేషన్ దాఖలుచేశారు. ఈ సందర్భంగా అభ్యర్థి పళ్ళ రాజేశ్వర్ రెడ్డి తో పాటు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, పొన్నాల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ మురళి కృష్ణకు 098 అసెంబ్లీ నియోజవర్గం అభ్యర్ధిగా తన 2 సెట్ నామినేషన్ పత్రాలను సమర్పించినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనగామ ఎమ్మెల్యేగా మంత్రులుగా జనగామను అభివృద్ధి చేసిన వారు నా వెంట ఉన్నారు. వారు సూచనలు సలహాలు తీసుకొని కురుక్షేత్రంలో కూడా ముందుకు వెళ్తానని చెప్పారు ఎన్నికల్లో గెలుస్తానని ఉధీమా వ్యక్తం చేశారు.
Read Also..
Read Also..
వరంగల్ ఉమ్మడి జిల్లాలో 12 నియోజవర్గల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. వరంగల్ పశ్చిమ రెండు సెట్ల నామినేషన్ పత్రాలను కాంగ్రెస్ అభ్యర్ధి నాయిని రాజేందర్ రెడ్డి దాఖలు చేశారు. దీంతో స్వీకరణ కార్యాలయాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. భూపాలపల్లిలో కీర్తిరెడ్డి, గండ్ర సత్యనారాయణరావు నామినేషన్లు వేయనున్నారు. పరకాలలో నామినేషన్లు వేసేందుకు 100 గ్రీన్ఫీల్డ్ బాధిత రైతులు సన్నద్ధం అవుతున్నారు. 12 నియోజకవర్గ కేంద్రంలో ఇండిపెండెంట్ అభ్యర్థుల ఆసక్తి చూపుతున్నారు.