రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల పీజీ విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మహత్య కేసు నిందితుడు సైఫ్పై వచ్చిన ఆరోపణలు నిజమేనని ర్యాగింగ్ నిరోధక కమిటీ తేల్చి చెప్పింది. సైఫ్పై విధించిన సస్పెన్షన్ కాలం మార్చి 3తో ముగియనున్న నేపథ్యంలో నిషేధాన్ని మరో 97 రోజులు పొడిగించింది. గతేడాది ఫిబ్రవరి 26న ప్రీతి మృతి తర్వాత సైఫ్ అరెస్టయ్యాడు. ఈ క్రమంలో అతడిపై ఏడాదిపాటు నిషేధం విధిస్తూ ర్యాగింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీనిపై సైఫ్ హైకోర్టును ఆశ్రయించడంతో సస్పెన్షన్ను తాత్కాలికంగా ఎత్తివేశారు. గతేడాది నవంబరు 9న హైకోర్టు ఆదేశాల మేరకు సమావేశమైన ర్యాగింగ్ కమిటీ ఎదుట సైఫ్ హాజరై వివరణ ఇచ్చాడు. సైఫ్పై వచ్చిన ఆరోపణలు వాస్తవమేనని కమిటీ న్యాయస్థానానికి తెలిపింది. దీంతో కమిటీ విధించిన సస్పెన్షన్ను కొనసాగించవచ్చని న్యాయస్థానం పేర్కొనడంతో, సైఫ్పై నిషేధాన్ని మరో 97 రోజులు పొడిగిస్తూ కమిటీ నిర్ణయం తీసుకుంది.
warangal
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ముందు మిర్చి రైతులు ధర్నా. తేజా రకం మిర్చి క్వింటాకు 20,100 మార్కెట్లో పలుకుతుండగా కేవలం 15000 నుంచి 17000 వేలకు క్వింటా చొప్పున రైతుల నుండి విక్రయిస్తున్నారని రైతుల ఆగ్రహం. అధికారులు సిండికేట్ గా మారి రైతులను మోసం చేస్తున్నారని ఆగ్రహం. సరైన మద్దతు ధర ప్రకటించకుండా రైతులను మోసం చేస్తున్నారని ఏనుమాముల మార్కెట్ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా. రైతుల ధర్నాతో స్తంభించిన రాకపోకలు.
వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో గతేడాది కంటే ఈ ఏడాది 7.7 శాతం నేరాలు పెరిగాయని వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు. క్రైమ్ వార్షిక నివేదికను సీపీ విడుదల చేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ మాట్లాడుతూ పోక్సో కేసులు 36 శాతం పెరిగితే, మహిళలపై 18 శాతం నేరాలు పెరిగాయని సీపీ తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 12 కోట్ల విలువైన వస్తువులు, డబ్బులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 18 మందిపై పీడీ యాక్ట్లు నమోదు చేశామన్నారు. మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్నామని స్పష్టం చేశారు. డ్రగ్స్ కొనుగోలు చేసినా, విక్రయించినా కఠినంగా శిక్షిస్తామన్నారు. ఈ ఏడాది 1167 మహిళా మిస్సింగ్ కేసులు నమోదు కాగా, 90 శాతం చేధించామన్నారు. వరంగల్ నగరంలో సీసీ టీవీ కెమెరాలు పెంచుతామన్నారు. మహిళలపై నేరాలను, సైబర్ క్రైమ్ను అరికడుతామన్నారు. భూకబ్జాదారులపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. చిట్ ఫండ్స్ కంపెనీల వల్ల ఇబ్బందులు పడ్డవారికి న్యాయం చేస్తామన్నారు. న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఇంకా ఎవరూ దరఖాస్తు చేసుకోలేదని తెలిపారు. డిసెంబర్ 31న డ్రంక్ అండ్ డ్రైవ్ చేపడుతామని సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు.
వరంగల్ జిల్లాలో ఆర్టీసీ బస్సుకు పెద్ద ప్రమాదం తప్పింది. రన్నింగ్ లో ఉన్న బస్సు వెనక టైర్లు ఊడిపోయవడంతో బస్సు ఓ పక్కకు ఒరిగి కొంత దూరం వెళ్లింది. ఎదురుగా ఏమీ రాకపోవడం, స్పీడ్ తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో కొంతమంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. హుజూరాబాద్నుంచి పల్లెవెలుగు బస్సు హనుమకొండ వెళ్తుండగా ఎల్కతుర్తి శివార్లలో ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. బస్సు వెనక టైర్లు రెండూ ఊడిపోయి పొల్లాలో పడిపోయాయి. అప్రమత్తమైన బస్సు డ్రైవర్ బస్సును నెమ్మదిగా రోడ్డు పక్కన ఆపారు. బస్సు ఓ పక్కకు ఒరగడంతో ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడటంతో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి.
Read Also..
Read Also..
ర్యాగింగ్ కు పాల్పడుతున్నారన్న కారణంతో 81 మంది విద్యార్థినుల పై సస్పెన్షన్ వేటు. సస్పెన్సన్ కు గురైన వారిలో పీజీ , కామర్స్, ఎకనామిక్స్ , జువాలజీ సెకండ్ ఇయర్ విద్యార్థినులు. జూనియర్లను కొంతకాలంగా ర్యాగింగ్ చేస్తూ ఇబ్బంది పెడుతున్న సీనియర్ విద్యార్థినిలు. వర్సిటీ అధికారులకు ఫిర్యాదు. విచారణ జరిపిన అనంతరం ర్యాగింగ్ నిజమేనని నిర్థారించి 81 మంది విద్యార్థులను సస్పెండ్ చేసిన వర్సిటీ అధికారులు. వారం రోజుల పాటు సస్పెన్షన్ వేటు.
ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే 6 గ్యారంటీలలో రెండు గ్యారెంటీలను అమలు చేశామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో మంత్రి పర్యటించారు. రవాణా మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఐదు లక్షల పరిమితి ఉన్న రాజీవ్ ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయలకు పెంచామన్నారు. ఆరోగ్యశ్రీ అన్ని హాస్పిటల్స్ లో అమలయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇచ్చిన అన్ని హామీలను వంద రోజుల్లోనే నెరవేరుస్తామని మంత్రి అన్నారు. గత ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం ఏ విధంగా ఇచ్చిందో అదే మాదిరిగానే ఇస్తామని స్పష్టం చేశారు. గజ్వేల్ నియోజకవర్గానికి మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రాతినిధ్యం వహించినా ఏనాడు ప్రజలను కలవలేదని పొన్నం ప్రభాకర్ విమర్శించారు.
బంగాళా ఖాతం లో ఏర్పడిన తీవ్ర తూఫాన్ ప్రభావంతో ఉత్తర, దక్షణ తెలంగాణా జిల్లాలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా తోపాటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, హన్మకొండ, వరంగల్, జనగాం, మహబూబబాద్, సూర్యాపేట తదితర జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సి.ఎస్. శాంతి కుమారి మాట్లాడుతూ, నేడు, రేపు రెండురోజులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు. భారీ వర్షాలు, వరదలు వచ్చిన సందర్భంలో పాటించాల్సిన ప్రొటొకాల్స్ కు అనుగుణంగా తగు చర్యలు చేపట్టాలని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలకు ఒక్కొక్క ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే పూర్తిగా నిండిన చెరువులకు గండ్లు పడకుండా తగు ముందు జాగ్రత చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నీటిపారుదల శాఖ, విపత్తుల నిర్వహణ శాఖ, రోడ్లు భవనాలు, పంచాయితీ రాజ్, రెవెన్యూ శాఖ లు అప్రమత్తంగా ఉండాలని, ప్రధానంగా వరదలు వచ్చే అవకాశం ఉన్నందున కాజ్-వె, లోతట్టు ప్రాంతాల వద్ద తగు జాగ్రత చర్యలు చేపట్టాలని అన్నారు. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా పునరావాస కేంద్రాలను ముందుగానే గుర్తించాలని సి.ఎస్ శాంతి కుమారి సూచించారు.
Read Also..
Read Also..
వరంగల్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. భూపాలపల్లి, జయశంకర్, ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో.
ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా వరి, పత్తి పంటలకు నష్టం చేకూరనుంది. దీంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది.
వరంగల్ జిల్లా నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికలు సజావుగా, పకడ్బందిగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ కృష్ణవేణి తెలిపారు. నియోజకవర్గంలో 283 పోలింగ్ కేంద్రాలు ఉండగా, 31 మంది సెక్టార్ అధికారులను, 3 ఫ్లయింగ్ స్క్వాడ్, 3క్విక్ రెస్పాన్స్ అధికారులను, 3 ఈవీయం ఇంజనీర్లను నియమించినట్లు తెలిపారు. నియోజకవర్గంలో 41 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉండగా కేంద్ర రాష్ట్ర పోలీసు బలగాలతో భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్నికల అధికారి కృష్ణవేణి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహణ, ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీ, ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల ఏర్పాటు చేశామని, ఈవిఎం యంత్రాల తరలింపు ఏర్పాట్లను ఎన్నికల కమీషన్ మార్గదర్శకాల ప్రకారం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. పోలింగ్ అనంతరం పోలింగ్ కేంద్రాల నుంచి ఎనుమాముల మార్కెట్ కౌంటింగ్ కేంద్రం స్ట్రాంగ్ రూమ్ కు ఈవిఎం యంత్రాల తరలింపు కోసం అవసరమైన వాహనాలను సిద్ధం చేశామని అన్నారు రిటర్నింగ్ అధికారి కృష్ణవేణి తెలిపారు.
నేడు వరంగల్ కు పవన్ కళ్యాణ్ రానున్నారు. హనుమకొండ బిజెపి అభ్యర్థి రావు పద్మ, వరంగల్ తూర్పు బిజెపి అభ్యర్థి ప్రదీప్ రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. జనసేన అధినేత వరంగల్ హంటర్ రోడ్ లోని సిఎస్ఆర్ గార్డెన్ వద్ద బిజెపి శ్రేణులు భారీగా సభ ఏర్పాట్లు చేశారు. భారీ సంఖ్యలో పాల్గొననున్న బిజెపి, జనసేన, పవన్ కళ్యాణ్ అభిమానులు.