అంగన్వాడీలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలం కావడంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఎమ్మెల్యేల ఇళ్ళను అంగన్వాడీలు ముట్టడించి ఆందోళన చేపట్టారు. ఏలూరులోని ఎమ్మెల్యే ఆళ్ల నాని ఇంటిని అంగన్వాడి మహిళలు ముట్టడించారు. ఎమ్మెల్యే ఆళ్ల నాని ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించి భారీ గేట్లను ఏర్పాటు చేసి అంగన్వాడీ మహిళలను అడ్డుకున్నారు. గత 16 రోజులుగా అంగన్వాడీలు తమ న్యాయమైన సమస్యలపై సమ్మె చేపట్టిన కనీసం ప్రభుత్వం స్పందించలేదని. రెండుసార్లు చర్చిలకు పిలిచి తమ సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం విస్మరించిందని వారు మండిపడ్డారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు అంగన్వాడీ మహిళలకు అనేక హామీలు ఇచ్చారని నాలుగున్నర సంవత్సరాలు గడుస్తున్నా కనీసం ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని లేకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
ysrcp
కాపు ఉద్యమ నేత వంగవీటి మోహన్ రంగా 35 వ వర్ధంతి సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణం లోని 12వ వార్డు పార్కు రోడ్డు లోని మున్సిపల్ కాంప్లెక్స్ నందు వైఎస్సార్సీపీ నాయకులు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నరసాపురం ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు పాల్గొని వంగవీటి మోహన్ రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగా ఒక కులానికి నాయకుడు కాదని పేద బడుగు బలహీనవర్గాలకు నాయకుడు అని పేదల కోసం ఆయన చేసిన సేవలు వర్ణించలేని వని అన్నారు. నేటి యువత వంగవీటి ని ఆదర్శంగా తీసుకుని జీవించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు చిట్టూరి కృష్ణ, వై.కే. యస్, పులపర్తి ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
మార్కాపురం గడియార స్తంభం సెంటర్ లో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి వైఎస్ఆర్సీపీ జెండాను ఆవిష్కరించి “ఆడుదాం ఆంధ్ర” కార్యక్రమాన్ని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నజాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, డిఎస్పి వీరరాఘవ రెడ్డి, అధికారులు, ప్రజా ప్రతినిధులు.. స్థానిక గడియారం వద్ద నుండి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల వరకు 100 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ లో మున్సిపల్, పంచాయితీ, సచివాలయ అధికారులు, వాలింటర్లు పాల్గొన్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించే ఆటల పోటీలను ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిర్వహిస్తున్న “ఆడుదాం ఆంధ్ర” క్రీడా పోటీలను నేడు సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంబించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి గుంటూరు శివారు నల్లపాడుకు సిఎం చేరుకుంటారు. ఒక ప్రైవేట్ స్కూల్లో ఆడుదాం ఆంధ్రా పోటీలను సిఎం జగన్ ప్రారంభిస్తారు. అనంతరం 15 వేల 4 గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో పోటీలు మొదలవుతాయి. డిసెంబర్ 26 నుంచి 2024 ఫిబ్రవరి 10వ తేదీ వరకు మొత్తం 47 రోజులపాటు ఐదుదశల్లో ఈ పోటీలు జరుగుతాయి. సిఎం జగన్ పర్యటన దృష్ట్యా భారీగా పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు.
Read Also..
అంగన్ వాడీలను ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటే చూస్తు ఊరుకోబోమని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హెచ్చరించారు. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారిని, బ్రాందీ షాపు వద్ద కాపలా పెట్టిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. ఏలూరు కలెక్టరేట్ వద్ద అంగన్వాడి మహిళలు చేపట్టిన నిరవధిక సమ్మె 15వ రోజు కొనసాగుతోంది. ఈ సమ్మెలో చింతమనేని పాల్గొని సంఘీభావం ప్రకటించారు. జగన్ కు దమ్ముంటే రాష్ట్రంలో పాదయాత్ర చేయాలని సవాల్ విసిరారు. పోలీసులు, గన్ మెన్లు లేకుండా కనీసం బయటకు రాలేని పరిస్థితిలో జగన్ ఉన్నాడన్నారు. ముఖ్యమంత్రి పాపం పండిందని, ప్రజలు ఎదురు తిరిగేందుకు సిద్ధంగా ఉన్నారని చింతమనేని తెలిపారు.
తన మాటను కూడా ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్సీ ఆవేదన వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో గత నాలుగు సంవత్సరాలుగా ఒక రైతు సమస్యను పరిష్కరించాలని, రెవిన్యూ అధికారులను చెప్పినా పట్టించుకోక పోవడంపై ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మండిపడ్డారు. గత కొంతకాలంగా స్థానిక ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి – ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. నియోజకవర్గ ప్రభుత్వ అధికారులు ఎమ్మెల్యే మాట వింటూ.. ఎమ్మెల్సీ జంగా.. పనులు చేయమని అధికారులను ఆదేశించినా కూడా పనులు జరగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక ప్రజాప్రతినిధి స్వయంగా చెప్పినా అధికారులు పనిచేయడం లేదంటే.. ఇక సామాన్య ప్రజల మాటేమిటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
తమ న్యాయపరమైన డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడి వర్కర్స్ & హేల్పర్స్ యునియన్ అద్వర్యంలో తలపెట్టిన అంగన్ వాడి నిరవధిక సమ్మె 14 వ రోజుకు చేరుకున్నప్పటికీ ప్రభుత్వం స్పందించక పోవడం చాల బాధకరం అన్నారు. అంగన్ వాడి నాయకురాలు మసృన్ బీ, చిన్నమండెం మండలం కార్యదర్శి ఉమా రాణి. 14 వ రోజు నిరవధిక సమ్మె నిరసన కార్యక్రమాన్ని అన్నమయ్య జిల్లా రాయచోటి ఆర్డివో కార్యాలయం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఆదేశాలు మేరకు సమాన పనికి సమాన వేతనం 26 వేల వేతనాన్ని అందజేయలన్నారు. అదే విధంగా తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె బాట పట్టిన మహిళల పట్ల వైసిపి నాయకులు అనేక అసత్య ఆరోపణలు చేయడం తగదన్నారు. తమ సమస్యలు పరిష్కరించాల్సింది పోయి అంగన్ వాడి తాళాలు పగల గొట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఈ ప్రభుత్వం సిగ్గు పడాల్సింది పోయి తమను తాము సమర్దించు కోవడం చాల సిగ్గు చేటన్నారు. నెల నెలకు అందని వేతనాలతో, చాలీ చాలని వేతనాలతో, అంగన్ వాడి కేంద్రాల అద్దెలు చెల్లించుకోలేక, కూరగాయలు, గ్యాస్, టి ఎ డి ఎ బిల్లులు రాకపోవడంతో అంగన్ వాడిలు ఆర్దికంగా అనేక దుర్బర దుస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని, లేని యెడల రానున్న రోజుల్లో అంగన్ వాడి మహిళల శక్తి ఏంటో ప్రభుత్వానికి తెలియజేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాయచోటి ఐ సి డి ఎస్ ప్రాజెక్ట్ పరిదిలోనున్న అంగన్ వాడి వర్కర్లు హేల్పర్లు పాల్గొన్నారు.
Read Also..
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం సరే కానీ ఆట స్థలాలు ఎక్కడ అంటూ గుంటూరు తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయి డిమాండ్ చేశారు. గుంటూరు లో ఉన్న విద్యార్థి సంఘాలు కాసు బ్రహ్మానందరెడ్డి స్టేడియం ను సందర్శన చేశారు. స్టేడియం అధ్వాన్నంగా తయారైందని ఆవేదన వ్యక్తంచేశారు. స్టేడియంలో మొలచిన పిచ్చి చెట్లని వారు తొలగించారు. స్టేడియం లో విద్యార్థుల కి మెరుగైన వసతులు ,సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లాలో ఆట స్థలాల పరిస్తితి ని సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలుసుకోవాలని చెప్పారు. పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం చేపట్టడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ది కోసమే ప్రభుత్వం ఇలాంటి పనులు చేస్తుందని మండి పడ్డారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో జేసీ, వర్సెస్ పెద్దారెడ్డి నాయకుల మద్య మరోసారి పాంప్లెట్లు కలకలంచోటుచేసుకుంది , దోచుకునే వారు వద్దు అభివృద్ధి చేసే వారే ముద్దు అంటూ పట్టణంలో పాంప్లెట్ ప్రచురణ చేశారు, వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి 2019 ఎన్నికల ముందు భూములు 53 ఎకరాలు ఉండగా, పెద్దారెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నాలుగున్నర సంవత్సరంలో దాదాపు 120 ఎకరాలు పైగా భూములు ఎలా వచ్చాయి? అని ఆయన ప్రశ్నించారు.
నెల్లూరు జిల్లా, కందుకూరు నియోజకవర్గం, ఉలవపాడు మండలం, కరేడు పంచాయతీలోని పెద్దపల్లెపాలెం గ్రామానికి చెందిన 12 కుటుంబాల వారు, ఈరోజు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. గ్రామానికి చెందిన తంబు శీను, వల్లభోని మల్లికార్జున, వల్లభోని వెంకటేశ్వర్లు, కొక్కిలిగడ్డ ప్రసాద్, కొక్కిలిగడ్డ వెంకట్రావు, కొక్కిలిగడ్డ కృష్ణారావు, నాయుడు రాజు, నాయుడు రాము, నాయుడు లక్ష్మణ్, నాయుడు సురేష్, పల్లెపాటి బాబులు, వల్లభోని నరసింహారావు లు పార్టీలో చేరగా… నియోజకవర్గ ఇన్చార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ, కొత్తగా వచ్చిన వారికి పార్టీలో తగిన గుర్తింపు, ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇస్తూ పాత, కొత్త నాయకులు అందరు కలిసి పనిచేసి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు. త్వరలోనే కందుకూరు నియోజకవర్గం నుంచి పార్టీలోకి భారీగా చేరికలు ఉంటాయని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ మోహన్ రెడ్డి దుర్మార్గాలను చూడలేక, వైసీపీ నుంచి అనేకమంది బయటికి వస్తున్నారని నాగేశ్వరరావు తెలిపారు.