కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లో మాజీ కేంద్ర మంత్రి కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో రైతు ప్రభుత్వం అంటున్నా వైసీపీ, కరువు వచ్చి రైతులు ఇబ్బంది పడుతుంటే ఈ ప్రభుత్వం ఏమి చేస్తుందన్నారు. చంద్రబాబు పై వైసీపీ కేసు పెట్టింది. టీడీపీ కుడా జగన్ పై కేసు పెడితే జగన్ తట్టుకో గలరా అన్నారు. న్యాయ వ్యవస్థ ను మ్యానేజ్ చేస్తూ సిబిఐ కేసులో జగన్ 3700 వాయిదాలు తెచ్చుకున్నాడు. జగన్ వచ్చిన కోర్టు వాయిదాలు తో గిన్నిస్ బుక్ ఎక్కోచ్చన్నారు. జిల్లా మొత్తం ను తక్షణమే కరువు జిల్లాగ ప్రకటించి ప్రతి రైతుకు ఎకరాకు 50 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణాలో కాంగ్రెస్, ఏపీ లో టీడీపీ అధికారం చేపడుతుందని కోట్ల ధీమా వ్యక్తం చేశారు.గతంలో రాజశేఖర్ రెడ్డి కొడుకని జగన్ కు ఓటు వేశారు, ఈ సారి జగన్ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ కుడా మరో రష్యా గ మారుతుందన్నారు.
ysrcp
పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, గుండ్లపల్లి వైయస్సార్ పార్టీ ఎంపీటీసీ. లోకేశ్వర్ రెడ్డి ఇంటి పైన ఎమ్మెల్యే మనుషూలు దౌర్జన్యం చేయడం మానుకోవాలనీ, వైఎస్సార్సీపీ కార్యకర్తలు,నాయకుల జోలికి వచ్చి దాడులు, దౌర్జన్యాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. పూతలపట్టు నియోజకవర్గం లో ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబుకు 2024లో వైయస్సార్ పార్టీ టికెట్ ఇవ్వకుండా ఎవరికీ ఇచ్చిన అందరం కలిసికట్టుగా పని చేస్తామని అన్నారు ప్రజలు. ప్రతి ఊరిలో రెండు మూడు వర్గాలను క్రియేట్ చేసిన ఘనత ఎమ్మెస్ బాబుది అని , వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బ్రష్టు పట్టిస్తున్న ఎమ్మెస్ బాబుకు టికెట్ ఇవ్వకూడదు అని ముక్త కంఠం తో ఆరోపించారు. ప్రజలను కార్యకర్తలను అనుసరించి పోకుండా విరుద్ధంగా ఇంటిపైన దౌర్జన్మలు చేయడము ప్రజలకు అందుబాటులో లేకుండా పోవడం దారుణంగా ఉందని అక్కడి ప్రజలు మీడియా సమావేశంలో తెలియజేశారు.తాము ఎప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పోరాడే నిజమైన సైనికులమని పెద్దిరెడ్డి నాయకత్వంలో మళ్లీ రాబోయే 20 ఏళ్లు జగనన్ననే సీఎం చేయటానికి అహర్నిశలు శ్రమిస్తామని వారు తెలిపారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం జగన్ నోరు విప్పాలని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా డిమాండ్ చేశారు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యల వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేశారు. సీఎం జగన్ గత నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలోని రోడ్ల గురించి పట్టించుకోలేదని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా విమర్శించారు. జగన్ పాలనపై తెలంగాణ సీఎం, మంత్రులు కూడా హేళన చేస్తున్నారన్నారు. రాష్ట్రం పరువును జగన్ రోడ్డున పడేశారని అన్నారు. ప్రజల అవస్థలను జగన్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు.
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తాజాగా బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై మరోసారి సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. నమ్మకద్రోహం పురంధేశ్వరి వ్యక్తిత్వంలోనే ఉందని దుయ్యబట్టారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరుతూ విలువల్లేని రాజకీయాలకు చిరునామాగా పురంధేశ్వరి మారారని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలై ఉండీ టీడీపీకి సేవ చేస్తున్నారని దుయ్యబట్టారు. పురంధేశ్వరి, ఆమె భర్త చంద్రబాబు పల్లకీ మోస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణకు చెందిన ‘అన్న టీడీపీ’కి కొంత కాలం గౌరవ అధ్యక్షురాలిగా ఉండి ఆ పార్టీ ఎన్నికల్లో పరాజయం పాలయ్యాక కాంగ్రెస్లో చేరారంటూ మండిపడ్డారు.
ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో బహునేర్పరి.. పురంధేశ్వరి అంటూ సెటైర్లు వేశారు. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉంటూ ఇంకో వైపు టీడీపీకి అనధికార గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగడం అనైతికమని సాయిరెడ్డి అన్నారు. తండ్రిని కాంగ్రెస్ పార్టీ అవమాన పరిచిందనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నంత కాలం అంటకాగిందని ఆరోపించారు.
దర్మాన క్రిష్ణ దాస్… మాజీ ఉప ముఖ్యమంత్రి, వైసిపి జిల్లా అద్యక్షులు 139 కులాలకు 59 కార్పోరేషన్ లు ఏర్పాటు చేసారు. జిల్లాలో రెండవ విడత సాధికార బస్సుయాత్ర నిర్వహిస్తున్నాం. బస్సు యాత్రకు ప్రజలు బహ్మరథం పడుతున్నారు. అన్ని వర్గాల వారికి సామాజిక న్యాయం చేసాం. పాదయాత్ర గుర్తించిన ప్రతీ సమస్యకు పరిష్కారం చూపిస్తున్నారు. విద్యా, వైద్యం కు ప్రదమ ప్రాధాన్యత నిచ్చారు.. దేశంలోనే అత్యుత్తమ విద్యా వ్యవస్థ ను నెలకొల్పుతున్నారు.. ఆర్బీకే లతో రైతులకు అన్ని విశాల సహాయ సహకారాలు అందజేస్తున్నాం. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం తో అనేక ప్రాజెక్ట్ లు వెనక బడ్డాయి. టెక్కలి లో మూడు వేల కోట్లతో పోర్టు నిర్మాణం సాగుతోంది. వాటర్ గ్రిడ్ ద్వారా ఉద్దానం కిడ్ని సమస్యకు పరిష్కారం చూపుతున్నాం. కిడ్నీ రిసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం. 4 ఏళ్లలో అనేక విప్లవాత్మక మార్పులు చెపట్టాం. వచ్చేది వైఏస్ జగన్ ప్రభుత్వమే. సర్వేలన్నీ మరలా జగన్ నే నెక్స్ట్ సిఏం అని చెపుతున్నాయి..
గుంటూరు సాధికారత యాత్రలో వాహాన దారులు ఇబ్బందులు పడ్డారు. ఎక్కడిక్కడ బారికేడ్లను ఏర్పాటు చేశారు. మంత్రులు మాట్లాడుతుండగా సభ కి వచ్చిన వాళ్ళు తిరిగి ప్రజలు వెళ్ళిపోయారు. రోడ్లు సైతం నిర్మానుష్యంగా మారాయి. సభ సక్సెస్ చేయాలని భావించిన వైసీపీ కి ప్రజలు తిరిగి వెళ్లడంతో అనుకున్న విధంగా సక్సెస్ కాలేకపోయింది.
Read Also..
నా ఏస్సి, బిసి అంటూ నమ్మించి గోంతుకోస్తున్న వ్యక్తి జగన్ బస్సు యాత్ర కి నైతికత లేదు.. అది సామాజిక బస్సుయాత్ర కాదు.. జగన్ సిఏం అయ్యాక ఆరువేల మంది దళితులపై దాడి చేసారు.., హత్యలు చేసారు.. 80% దాడులు చేసింది కూడా రెడ్డి సామాజిక వర్గం వారే.. ఎమ్మెల్సీ అనంత బాబు మర్డర్ చేసి డోర్ డెలివరీ చేస్తే.. రాచ మర్యాదలు.. కంచికచర్లలో శ్యాం కుమార్ అనే దళితుడిని అమానుషంగా చంపారు.. బీహార్ ని తలపిస్తుంది ఆంద్రా.. దళితులు ,ఎస్టి ,బీసి ల పై దాడులు జరుగుతుంటే మంత్రులకు సిగ్గు లేదా యాత్రలు చేయడానికి.. మంత్రి నాగార్జున కి మంత్రిగా కొనసాగే అర్హతేలేదు.. జబర్దస్త్ రోజా చెప్పినట్లు.. గన్ కంటే ముందు వస్తాడన్న జగన్ ఏమయ్యారు.. ప్రజలను డైవర్ట్ చేయడానికే సామాజిక బస్సుయాత్ర దళిత మహిళలపై దాడుల కేసుల్లో ఏపి దేశంలో నెంబర్ వన్ అని NCRB ప్రకటించింది. 26 వేల కోట్ల రూపాయిలు ఎస్ సి సబ్ ప్లాన్ నిధులు డైవర్ట్ చేస్తే… ఏం చేస్తున్నారు దళిత మంత్రులు, ఎమ్మెల్యేలు. 50 వేల బ్యాక్ లాగ్ ఉద్యోగాలు ఖాలీ ఉన్నాయి. తమ జాతికి అన్యాయం జరుగుతున్నా ఏందుకు మౌనంగా ఉంటున్నాయి దళిత సంఘాలు..
రాష్ట్రంలో బ్రిటిష్ పాలన కన్నా చాలా దరిద్రమైన పాలన కొనసాగుతోంది….. సీఎం జగన్ మోహన్ రెడ్డి తనపై ఉన్న కేసుల నుంచి ఎన్నిసార్లు ఎస్కేప్ కాలేదు… జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో చేయని తప్పంటూ లేదు… రాష్ట్రంలో అన్ని రంగాలను సిఎం జగన్మోహన్ రెడ్డి పూర్తిగా నిర్వీర్యం చేశాడు… జగన్మోహన్ రెడ్డి పెద్ద మార్కెట్, ఎమ్మెల్యేలు చిన్న మార్కెట్లు, నాయకులు చిల్లర మార్కెట్లు… ఎర్రచందనం ఇష్టం వచ్చినట్లు అమ్మింది వాస్తవమా కాదా… స్టిక్కర్ లిక్కర్ కింగ్ సిఎం జగన్మోహన్ రెడ్డీ…. కనికరం లేని కనకమహారాజు సీఎం జగన్మోహన్ రెడ్డి…. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిని విమర్శించే అర్హత దగుల్బాచీ విజయసాయి రెడ్డికి లేదు… మధ్యంలో భారీ స్థాయిలో దోపిడీ జరిగింది…. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అమీషా కు నివేదిక ఇచ్చారు… పార్లమెంట్ సాక్షిగా విజయసాయి రెడ్డి బిజెపికి మద్దతు ఇవ్వడం లేదా… అసలు విజయసాయి రెడ్డీ ఏ పార్టీలో ఉన్నాడో తేల్చుకోవాలి…. సీబీఐ ఈడి కేసులో ఇరుక్కున్న మాట వాస్తవం కాదా…విజయసాయి రెడ్డి తప్పు చేయలేదా…. వివేకానంద రెడ్డిని హత్య చేసిందేవరో తెలియదా…. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శంకర్ రెడ్డిలు నిందితులు కాదా… రాష్ట్రానికి చేసింది ఏమి లేదు… స్కిల్ డెవలప్మెంట్ కేసులో పిటిషన్ క్వాష్ అయితే చంద్రబాబు నాయుడు కేసులన్నీ మటాస్ ….
Read Also..
హాజరైన మంత్రి బొత్స సత్యనారాయణ, వైవి సుబ్బారెడ్డి, జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, స్థానిక ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గత పాలకుల మాదిరిగా మాటలకే పరిమితమవకుండా జిల్లా అభివృద్ధిలో జగన్ మార్క్ కనిపిస్తుందని చెప్పారు. దాదాపు 1200 ఎకరాల విస్తీర్ణంలో బొడ్డవర సమీపంలో ఎస్ ఈ జెడ్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని దీని ద్వారా మూడు వేల కోట్లకు పైగా పెట్టుబడులు జిల్లాకు రావటం వల్ల జిల్లాలో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు కూడా ప్రారంభమవుతున్నాయని జిల్లా వ్యాప్తంగా రైతులు వర్షాధారం పైనే ఆధారపడి పంటలు పండిస్తున్నారని ఇటువంటి పరిస్థితుల్లో సుజల స్రవంతి లాంటి ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా రైతులకు సాగునీరు అందించవచ్చునని తెలిపారు రాష్ట్రంలో సంక్షేమ ఫలాలను అట్టడుగు స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఒక్క వైకాపా ప్రభుత్వానిదే అని చెప్పారు…
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లి ప్రభుత్వ పాఠశాలలో జగన్నన్న గోరుముద్ద పథకంలో మరోసారి బయటపడ్డ కుంభకోణం…. విద్యార్థులకు అందించే రాగిపిండి , బెల్లం డేట్ కొట్టేసి ఉన్న వాటిని స్కూల్ అధికారులు వాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ జగనన్న గోరుముద్ద పిల్లలకు గోరి కడుతుందని, నాణ్యతలేని మరియు గడువు తేదీ ముగిసిన ఆహార పదార్థాలను వాడి పిల్లలకు పెడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజుల క్రితం దాచేపల్లి మండలంలో ఫుడ్ అధికారుల తనిఖీలో బయటపడ్డ ఎక్స్పైర్ అయిపోయిన రాగి పిండి మరియు బెల్లం ప్యాకెట్లు… ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు…. ఇలా పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.