Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Crime ఎర్రచందనం దొంగల పై టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులు

ఎర్రచందనం దొంగల పై టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులు

by Prakash
red sandle

సత్యవేడు మండలం ఇందిరా నగర్ సమీపంలో ఓ ప్రైవేటు లైసెన్స్ ఎర్రచందనం గోడౌన్ లో తమిళనాడుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్లు ఎర్రచందనం దొంగలు దొంగలించి లారీలో వేసుకొని వెళ్తుండగా సినీ పక్కిలో వారిని వెంబడించి దాడులు నిర్వహించి దాదాపు లారీ తో సహా నాలుగు టన్నుల పైబడి ఎర్రచందనం స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు, సత్యవేడు సిఐ సర్కిల్ కి చెందిన స్థానిక పోలీస్ అధికారులు కూడా ఈ దాడుల్లో పాల్గొన్నట్లు సమాచారం. 16 మంది స్మగ్లర్లను అదుపులో తీసుకున్నట్లు సమాచారం. అందులో తమిళనాడుకు చెందిన ఒక ప్రభుత్వ ఉద్యోగి కూడా ఉన్నట్లు సమాచారం. ఎర్రచందనం గోడౌన్లో కాపలా దారులను బెదిరించి వారిని కట్టివేసి దొంగతనానికి పాల్పడ్డ ఎర్రచందనం దొంగలు. తమిళనాడుకు చెందిన ఎర్రచందనం దొంగలు ఈ గోడౌన్ పై దాడులు చేస్తారని ఖచ్చితమైన సమాచారంతో వారం రోజులుగా టాస్క్ ఫోర్స్ నిఘా పెట్టినట్లు సమాచారం. ఈ దాడుల్లో దాదాపు 30 మంది టాస్క్ఫోర్స్ అధికారులు పాల్గొన్నట్లు సమాచారం. ఈ కేసును స్థానిక పోలీసులకు అప్పచెప్పినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisements

You may also like

Our Visitor

039446
Total views : 196872

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: