Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Andhra PradeshChittoor టీడీపీ ఆరు పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్తున్న టీడీపీ నాయకులు

టీడీపీ ఆరు పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్తున్న టీడీపీ నాయకులు

by Rama
Six schemes

తంబళ్లపల్లె నియోజకవర్గం లో ఆరు మండలాలు ఉండగా అన్ని మండలాలలో టీడీపీ కి మంచి పట్టు ఉంది. ఈ నియోజకవర్గం లో ప్రజలు టీడీపీకే అనేక సార్లు పట్టం కట్టారు. 2019 ఎన్నికలో వైసీపీ నుండి ద్వారక నాద రెడ్డి గెలుపొందారు. అయినా నియోజకవర్గంలో అభివ్రుద్ది మాత్రం శూన్యం అంటున్నారు అక్కడి స్థానికులు. ఇప్పటికే వైసీపీ దాదాపు అన్ని ప్రాంతాలకు నియోజకవర్గం ఇన్చార్జిలను ప్రకటించింది. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా ఇంకా అభ్యర్థులను ప్రకటించక పోయినప్పటికీ ఆయా ప్రాంతంలోని టీడీపీ నాయకులు వైసీపీ అరాచకాలను ప్రజలకు తెలుపుతూ టీడీపీ ప్రకటించిన ఆరు పథకాలను ప్రజల వద్దకు తీసుకెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే తంబళ్లపల్లె నియోజకవర్గం సంబంధించి రైతు బిడ్డ, ప్రముఖ వ్యాపారవేత్త జయచంద్రారెడ్డి టీడీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ వైసీపీ అక్రమాలను ప్రజల కళ్ళకు కట్టినట్టు వివరిస్తున్నారు. తంబళ్లపల్లి నియోజకవర్గంలో గెలుపు ఓటమిలను నిర్ణయించేది మురిసికాపు రెడ్డీస్ మాత్రమే. అలాంటి సామాజిక వర్గానికి చెందిన జయచంద్ర రెడ్డి తంబళ్లపల్లి నియోజకవర్గం ఇండస్ట్రియల్ కారిడార్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు తెచ్చి ఇక్కడి రైతుకు చేయూతనిస్తాము అంటున్నారు. 2024 ఎన్నికలలో తంబళ్లపల్లి నియోజకవర్గం ని టీడీపీ ఖాతాలో జయచంద్ర రెడ్డి వేస్తామంటున్నారు.

Advertisements

You may also like

Our Visitor

014176
Total views : 79493

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.