Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Telangana కేసీఆర్‌ను పరామర్శించిన చినజీయర్ స్వామి

కేసీఆర్‌ను పరామర్శించిన చినజీయర్ స్వామి

by Satya
Chinajiyar Swamy visited KCR

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామి పరామర్శించారు. కేసీఆర్ ప్రస్తుతం సోమాజిగూడలోని ఓ కార్పోరేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. చినజీయర్ స్వామి ఆసుపత్రికి వెళ్ళి బీఆర్ఎస్ అధినేతను పరామర్శించారు. నిన్న కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆధ్వర్యంలో కేసీఆర్‌కు 20 మంది వైద్యుల బృందం సర్జరీ నిర్వహించింది. ఆ తర్వాత ఆయనను పలువురు నాయకులు ఆసుపత్రిలో పరామర్శించారు. ఈ క్రమంలో చిన్నజీయర్ స్వామి మాజీ సీఎంను పరామర్శించారు. అనంతరం వైద్యులతో మాట్లాడి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని చిన్నజీయర్ స్వామి ఆకాక్షించారు. ఆ తర్వాత అక్కడే ఉన్న కేసీఆర్ కుటుంబ సభ్యులతో చిన్నజీయర్ స్వామి కొంతసేపు మాట్లాడారు.

Advertisements

You may also like

Our Visitor

039657
Total views : 199055

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: