సనత్ నగర్ నియోజకవరంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ నీలిమ ఇంటింటి ప్రచారం బన్సిలాల్ పేట్ డివిజన్ లోని బలరాం కాంపౌండ్, పద్మారావు నగర్ హమాలి బస్తీలో నిర్వహించారు. ఈ సందర్భంగా కోటా నీలిమ మాట్లాడుతూ… నగరంలో అభివృద్ధి జరుగుతుంటే పద్మరావు నగర్ లో రోడ్లు, హమాలీ బస్తీ ఎందుకు అంత అధ్వనంగా ఉందని ప్రశ్నించారు. తిండికి లేని కేసీఆర్ కుటుంబానికి ఇవాళ లక్షల కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత ఆశపడిందని, కానీ వారి ఆశలపై కేసీఆర్ నీళ్లు చల్లారన్నారు. ఉద్యోగాలు రాక యువత ఆత్మహత్యలు చేసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. తెలంగాణ సాధించింది ఇందుకేనా? అని ప్రశ్నించారు.
Hyderabad
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బాగంగా ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మందుముల పరమేశ్వర రెడ్డి ప్రచారంలో దూసుకెళుతున్నారు. ఏఎస్ రావు నగర్ డివిజన్లోని కమల్ నగర్ లతో పాటు పలు ప్రాంతాలలో కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ అభ్యర్థి మందుముల పరమేశ్వర రెడ్డి, ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేసి పరమేశ్వర రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన 6 సంక్షేమ పథకాలను వివరిస్తూ తనకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా బౌద్దనగర్ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ కంది శైలజతో కలిసి పద్మారావు గౌడ్ విస్తృతంగా పర్యటించారు. జామే ఉస్మానియా, ఈశ్వరీబాయి నగర్, ఎల్ నారాయణ నగర్, అంబర్ నగర్, బౌద్ధనగర్, సంజయ్ గాంధీ నగర్ తదితర ప్రాంతాల్లో పద్మారావు గౌడ్ పర్యటనకు
ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. కార్యకర్తలతో పాటు స్థానిక ప్రజలు కూడా ఆయనను అడుగడుగునా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా
పద్మారావు గౌడ్ మాట్లాడుతూ గతంలో తాము చేపట్టిన వివిధ శాశ్వత చర్యల వల్ల ప్రజలు భారీ వర్షాల వల్ల ఇబ్బంది పడే పరిస్థితులు తప్పాయని, సికింద్రాబాద్ పరిధిలో పలు ప్రధాన నాలా ల వెడల్పు, కల్వర్టుల పునర్నిర్మాణం వంటి పనులను చేపట్టామని తెలిపారు. సికింద్రాబాద్ పరిధిలో కరోనా నివారణ చర్యలను నిరంతరం తీసుకొని ప్రజలకు అండగా నిలిచామని తెలిపారు. నిరంతరం ప్రజల సమస్యలను తీర్చేందుకు సితాఫలమండీ లో తమ కార్యాలయం ఏర్పాటు చేసుకొని నిజాయితీగా ప్రజలకు సేవలను అందించే సిబ్బందిని ఈ కార్యాలయంలో నియమించుకున్నామని తెలిపారు. ప్రజలకు అందుబాటులో నిలిచిన తమకే ప్రజలను ఓటు అడిగే హక్కు ఉందని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం వ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అరాచకాలకు అడ్డుకట్ట వేయడానికే కాంగ్రెస్ పార్టీనిఎంచుకున్నట్లు తెలిపిన నవీన్ యాదవ్. జాయినింగ్ ప్రోగ్రాంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి నవీన్ యాదవ్ను పార్టీలోకి ఆహ్వానించిన టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మల్లికార్జున్ కార్గే.
రేవంత్ రెడ్డి పాయింట్స్:
జూబ్లీహిల్స్ వ్యాప్తంగా చిన్న శ్రీశైలం యాదవ్ కుటుంబానికిఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయి.
కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ప్రశ్నించే వారు ఎవరి పాలనలో ప్రజా జీవితంచక్కగా ఉందో ఆలోచించుకోవాలి. జంట నగరాల వ్యాప్తంగా పేదల పక్షాన ప్రశ్నించే గొంతుక పీజేఆర్ మరణంతో మూగబోయింది. ఇప్పుడు యువ రక్తం నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో చేరికతో జంట నగరాలకు నాయకత్వం లభించినట్లునేను అనుకుంటున్నాను. ఈరోజు తన నామినేషన్ ని వదిలివేసి కేవలం నియోజకవర్గం ప్రజా శ్రేయస్సు కోరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అజారుద్దీన్ బలపరచడానికి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నవీన్ యాదవ్ కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం వ్యాప్తంగా ఎంతో అనుభవకుడైన చిన్న శ్రీశైలం యాదవ్ అనుభవ పాఠాలను అజారుద్దీన్, నవీన్ యాదవ్ పాటిస్తూ ఎన్నికలలో జూబ్లీహిల్స్ గడ్డమీద కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయం.
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం ఆశోక్ నగర్ లోని తన కార్యాలయంలో గాలి అనిల్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఇన్నేళ్లు కష్టపడ్డానని, కష్టపడ్డ వారికి సముచిత స్థానం దొరకడం లేదన్నారు. స్వంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పార్టీ కోసం పనిచేశానని, బీసీలకు పూర్తిగా అన్యాయం జరిగిందని వాపోయారు. గత ఐదేళ్లక్రితం టికెట్ ఇస్తానంటే కాంగ్రెస్ పార్టీలో చేరానని, ఆనాడు – ఈనాడు నాకు మోసం జరిగిందన్నారు. నేషనల్ పేపర్ లకు యాడ్స్ ఇవ్వడం తో కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నాయకులతో పాటు నాకు ED నోటీసులు అందాయన్నారు. ఇంత జరిగిన రాష్ట్ర నాయకత్వం మమ్మల్ని పలకరించలేదని వాపోయారు. తీవ్ర మనస్థాపం చెంది కాంగ్రెస్ పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తూ ఏఐసీసీ ఇంచార్జీ ఖర్గే కు ఫ్యాక్స్ ద్వారా రాజీనామా పత్రాన్ని అందజేశారు.
Read Also..
ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా మధుయాష్కీ ఇంటిపై దాడి అర్ధరాత్రి జరిగిన సంఘటనపై మధు యాష్కీ స్పందించి ఈ రోజు వారి నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి ఒడిపోతని అనే భయంతో పిరికి పంద లాగా కాంగ్రెస్ కార్యకర్తలపై దాడి చేయించాడని దాడులు మాకు కొత్త ఏమి కాదని ఈ లాంటి దాడులు మళ్ళీ జరిగితే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ఎన్నికల కమిషన్ ec కి కూడా కంప్లైట్ చేస్తామని నీచపు రాజకీయాలు మానుకోవాలని Brs అభ్యర్ధి సుధీర్ రెడ్డి కి సూచించారు.
తెలంగాణ అభివృద్ధి చెందాలంటే నరేంద్రమోదీ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల కోసం పని చేసే నాయకుడు ఎవరనేది గమనించి ఎన్నుకోవాలన్నారు. బీజేపీ విడుదల చేసే మేనిఫెస్టో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుందని వెల్లడించారు. బీఆర్ఎస్, మజ్లిస్, కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాయని ఆరోపించారు. అందుకే ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు.
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం చింతల్ డివిజన్ లో శివ నగర్, శ్రీ సాయి కాలనీ, రంగా నగర్, సాగర్ అపార్ట్మెంట్స్, సిరి టవర్స్ లలో బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ విస్తృత ప్రచారం చేశారు. బీజేపీ సీనియర్ నేత సదానంద్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ నగర్ కు చెందిన పలువురు యువకులు బీజేపీలో చేరారు. బీజేపీ కండువా కప్పి ఆహ్వానించారు. పలు కాలనీ సంక్షేమ సంఘాలు, అపార్ట్మెంట్స్ అసోసియేషన్ లు, కాలనీ పెద్దలతో సమావేశమయ్యారు. చింతల్ డివిజన్ ను టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అభివృద్ధి చేయడంలో విఫలమయ్యాడన్నారు. భగత్ సింగ్ నగర్ మల్టి పర్పస్ ఫంక్షన్ హల్ ను ఇప్పటికీ ప్రజలకు అందుబాటులోకి తేలేదని మండిపడ్డారు. 2018 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. బీజేపీ ని గెలిపిస్తే చింతల్ డివిజన్ లో మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
హయత్నగర్లో అర్థరాత్రి హై టెన్షన్ … మధుయాష్కీ గౌడ్ ఇంటి పై పోలీసుల దాడి
హైదరాబాద్లోని మధుయాష్కీ గౌడ్ నివాసంపై అర్థరాత్రి పోలీసులు దాడి చేశారు. ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా, మూకుమ్మడిగా పోలీసుల బృందం ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడింది. సోదాల పేరుతో, కుటుంబ సభ్యులను పోలీసులు భయబ్రాంతులకు గురిచేశారు. మధుయాష్కీ నివాసంలో పెద్ద ఎత్తున డబ్బు ఉందన్న సమాచారంతో, పోలీసులు దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ సెర్చ్ వారెంట్ లేకుండా దాడి చేయడంతో, కాంగ్రెస్ శ్రేణులు ఆశ్చర్యపోతున్నాయి. హయత్ నగర్ లో ఉద్రిక్తత అర్థరాత్రి మధుయాష్కీ గౌడ్ నివాసం ఇంటిపై అనుమతి లేకుండా ఇంట్లోకి చొరబడి పోలీసుల మూకుమ్మడి దాడి జరగటం తో కుటుంబ సభ్యులు భయబ్రాంతులకు గురి అయ్యారు.
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు మరింత వేడెక్కాయి. కాంగ్రెస్, మజ్లీస్ పార్టీల మద్య మాటల యుద్దం కొనసాగుతుంది. రెవంత్ రెడ్డి ఇటివలె మజ్లీస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేసారు. ఈ నేపద్యంలో అక్బరుద్దీన్ స్పందించారు. రేవంత్ రెడ్డి తమను రెచ్చగొడుతున్నారని అన్నారు. ఇప్పటి వరకు జరిగిన హిందూ – ముస్లిం గొడవలు తీసుకువచ్చిందే కాంగ్రెస్ అని ఆరోపించారు. రేవంత్ రెడ్డి తమ జోలికి రావొద్దని, వస్తే కనుక ఆయన జీవితచరిత్ర బట్టబయలవుతుందని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ఆర్ఎస్సెస్ నుంచి వచ్చాడని, ఆ తర్వాత టీడీపీ, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారని అన్నారు. తెలంగాణలో రెడ్డి, రావు, ఎవరైనా సరే మా ముందు వంగాల్సిందే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. నెహ్రూ దేశ విభజన వల్లే భారత్ – పాకిస్తాన్ రెండు ముక్కలైందని, లేదంటే ఒకే దేశంగా ఉండేదన్నారు.





Total views : 201206