సంగారెడ్డి లో మంత్రి కేటీఆర్ రోడ్ షో విద్యార్థి, యువజన ఆత్మీయ సమ్మేళనంలో బిఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ తరపున ప్రచారం కేటీఆర్ కామెంట్స్ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అంటూ ప్రజలను మోసం చేస్తోంది కర్నాకటలో కాంగ్రెస్ వచ్చింది.. కరెంట్ పీకింది డిసెంబర్ మూడు తారీఖున సంగారెడ్డి కి కాబోయే ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కాంగ్రెస్ కు ఒక్క ఛాన్స్ కావాలంటా..55 ఏండ్లు ఇచ్చినా ఏం చేశారు మళ్లొకసారి వచ్చి ఏక్ బార్ దో అంటున్నారు రేవంత్ రెడ్డి మూడు గంటల కరెంట్ చాలు అంటున్నాడు.. డి కే శివకుమార్ తెలంగాణలో ఐదు గంటల కరెంట్ ఇస్తామంటున్నారు వాళ్లకు ఇక్కడ 24 గంటల కరెంటు కనిపించడం లేదా సంగారెడ్డి నియోజకవర్గం లోని ఏ ఊరిలో నైనా వెళ్లి కరెంటు తీగలు పట్టుకోండి తెలుస్తుంది… కరెంటు ఉందో.. లేదో..కరెంట్ తీగలు పట్టుకోండి దేశం దరిద్రం పోతుంది. తెలంగాణకు ఉన్న ఒకే ఒక గొంతుక కేసీఆర్. కేసీఆర్ ను ఖతం చేసేందుకు చూస్తున్నారు. 55 కిలోల కేసీఆర్ ను కొట్టేందుకు మోడి, అమిత్ షా, రాహుల్ గాంధీ, ఠాక్రే పోటీ ఎందుకు..? కేసీఆర్ గొంతుక పిసికేందుకు షంషేర్ లు తీస్ మార్ ఖాన్ లు వస్తున్నారు. సింహ మెప్పుడు సింగిల్ గానే వస్తుంది, 95 సీట్లలో గులాబీ జెండా ఎగురుతుంది
Medak
ఐదు సంవత్సరాలు మీ కోసం పనిచేశానని, అభివృద్ధిని చూసి తనకు మార్కులు వేయాలని మంత్రి హరీష్ రావు కోరారు..సిద్దిపేట అభివృద్ధి కోసం కష్టపడ్డానని,ఎన్నికల సమయం లో హడావుడి చేసేవారి పట్ల జాగ్రత్తగా ఉండాలని హరీష్ రావు కోరారు. మీ కష్టసుఖాల్లో పాలుపంచుకున్న నాకు మీరు ఓట్ల రూపంలో మార్పులు వేసి దీవించాలని ఆయన కోరారు..
సిద్దిపేట జిల్లా బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు అరుణారెడ్డి 50 మంది మహిళా కార్యకర్తల్లో మంత్రి హరీష్ రావు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీని ఆదరించాలని కోరారు..
అనంతరం గజ్వేల్ నుండి హెలికాప్టర్ లో కామారెడ్డి చేరుకొని నామినేషన్ వేస్తారు. అనంతరం అక్కడ నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఎన్నికల ప్రచారం ముగింపు సభ సీఎం గారితో గజ్వేల్ లో ఈనెల 28 తారీకు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. 2014, 2018 లో కూడా ముగింపు సభ గజ్వేల్ లో చేసుకున్నాం రాష్ట్రంలో అద్భుతమైన విజయం సాధించాం. అప్పుడు అదే ఆనవాయితీ కొనసాగించబోతున్నాము. కెసిఆర్ కు ఓటు వేసి రుణ తీర్చుకునేందుకు గజ్వేల్ ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇచ్చిన హామీలే కాదు ప్రజలు కోరని పనులను కూడా గజ్వేల్ లో సీఎం పూర్తి చేశారు. కరువు పీడిత ప్రాంతమైన గజ్వేల్ నేడు కాళేశ్వరం జలాలతో సస్యశ్యామలమయ్యింది. గతుకుల గజ్వేల్ ను బతుకుల గజ్వేల్ గా మార్చింది కేసీఆర్. విద్యాలయాలకు, రిజర్వాయర్లకు నిలయంగా మారింది గజ్వేల్. దేశ విదేశ ప్రతినిధులు గజ్వేల్ కు వచ్చి ఇక్కడ అభివృద్ధిని మెచ్చుకుంటున్నారు. కోకాకోలా, ఫుడ్ ప్రాసెసింగ్ హబ్స్ రావడం వల్ల ఎంతో మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు. గజ్వేల్ చరిత్రలో రానటువంటి రికార్డు మెజారిటీ ఈసారి కేసీఆర్ గారికి రాబోతున్నది. లక్షలకు పైగా మెజారిటీతో గజ్వేల్ లో గెలిచి తీరుతాం. కొందరు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. పెద్దవాళ్ల మీద పోటీ చేస్తే పెద్దవాళ్ళం అవుతామని అనుకుంటున్నారు. కేసీఆర్ కు సరితూగే నాయకుడు ఈ రాష్ట్రంలో మరెవరూ లేరు. జీవితాన్ని ఫణంగా పెట్టీ తెలంగాణ సాధించారు. ఇంకెవరు పోటీ వచ్చినా అది నామ మాత్రమే కెసిఆర్ మా ముఖ్యమంత్రి అని గజ్వేల్ ప్రజలు గొప్పగా చెప్పుకుంటున్నారు. వేరే వాళ్ళు ఉంటే ఆ గౌరవం గజ్వేల్ కు ఉంటుందా. పక్క జిల్లాలు, నియోజకవర్గాల నుంచి కిరాయి మనుషులను తెచ్చుకొని షో చేయాల్సిన అవసరం మాకు లేదు. ఎక్కడినుండి నిన్న జనం వచ్చారో ప్రజలందరికీ తెలుసు. మా పార్టీ కుటుంబ సభ్యులే 25 వేల మంది దాకా ఉంటారు. నీళ్లు పట్టుకునే మంచినీళ్ల బిందెలో, పండిన ప్రతి గింజలో కెసిఆర్ కనిపిస్తున్నాడని ప్రజలు చెబుతున్నారు. తెలంగాణ ద్రోహులంతా రాష్ట్రంలో ఏకమవుతున్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీకి, పవన్ కళ్యాణ్ బిజెపి పార్టీకి మద్దతు పలుకుతున్నారు. ఆనాడు తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన శక్తులు నేడు కాంగ్రెస్, బిజెపి రూపంలో తెలంగాణపై దాడి చేసేందుకు కుట్ర చేస్తున్నాయి. తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాళ్ళ చేతుల్లో పెడితే ఆగం అవుతాం. దయ్యాల పాలు చేసినట్లు అవుతుంది. రిస్క్ లేకుండా నీళ్ళు, సాగు నీళ్ళు, రైతు బంధు, రైతు బీమా, పింఛన్లు వస్తున్నాయి. మరి రిస్క్ తీసుకొని వేరే ప్రభుత్వానికి ఓటు వేయడం ఎందుకు పండిన పంట ఏ తంటా లేకుండా ఊరూరా కాంట పెట్టీ కొనుగోలు చేసస్తున్నారు. కర్ణాటక సీఎం ధన్యవాదాలు చెప్పాలి. కర్ణాటకలో 5 గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నట్లు ఒప్పుకున్నారు. రేవంత్ రెడ్డి 3 గంటల కరెంట్ చాలు అని చెప్పి ఇప్పుడు మాట మార్చాడు. నేను అనలేదు అని బుకాయిస్తున్నడు. అన్న మాట, వీడియో అందరూ చూశారు. కుల్లం కుల్లం అన్నవు. గూగుల్ చేసి చూడు రేవంత్ రెడ్డి. 5 గంటలు కావాలి అనేవాళ్ళు కాంగ్రెస్ కు, 24 గంటల కరెంట్ కావాలనుకునేవాళ్లు బిఆర్ఎస్ కు ఓటు వేస్తరు. పుట్టిన బిడ్డ తల్లి చేతిలో ఉంటే మేలు ఎలా జరుగుతుందో, కెసిఆర్ చేతిలో తెలంగాణ ఉంటే అలా మేలు జరుగుతుంది. సురక్షితంగా ఉంటుంది.
కెసిఆర్ గారి ఆశీస్సులతొ మెదక్ నియోకవర్గము ను అభివృద్ధి చేశానని మెదక్ ప్రజలు మళ్లీ ఒక సారి అవకాశం ఇస్తే ప్రజలకు సేవ చేస్తానని మెదక్ brs పార్టీ మెదక్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మ దేవేందర్ రెడ్డి అన్నరు, ఈ రోజు మెదక్ ఎమ్మెల్యే అభ్యర్థి గా నామినేషన్ వేసిన సందర్భంగా ఆమె విలేరులతో మాట్లాడుతూ మెదక్ అభివృద్ది కీ పాటు పడుతనని,, 2014నేటి వరకు ఎంతో అభివృద్ది చేశానని మెదక్ ప్రజల కోసం జిల్లా కావడం గొప్ప విషయం అని ఆమె అన్నారు. మెడికల్ కాలేజీ శంకుస్థాపన చేయడం జరిగింది అని ఆమె తెలిపారు.
మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ బంజారా గిరిజన ఆత్మీయ సమ్మేళనం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి, BRS ఎమ్మెల్యే అభ్యర్థి వాకి GBటి సునీతా లక్ష్మారెడ్డి బిఆర్ఎస్ శ్రేణులు బంజారాలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం గిరిజనులకు పెద్దపీట వేసింది, తండాలను గ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత కేసిఆర్ది గిరిజనుల అభ్యున్నతికై బిఆర్ఎస్ ప్రభుత్వం పాటుపడుతుందని, కాంగ్రెస్ బిజెపిలు వచ్చి రాజకీయం చేస్తే నమ్మకం అని సూచించారు సత్యవతి రాథోడ్. లోకబాజీ మాటలతో మహిళలను మాటల గారడి చేయడానికి చూస్తున్నారు బిజెపి కాంగ్రెస్లు వారి మాటలను నమ్మకండి అని గిరిజనుల అభివృద్ధికై అహర్నిశలు పాటుపడుతున్న సునీత లక్ష్మారెడ్డి ని గెలిపించాలని వారు కోరారు.
Read Also..
కెసిఆర్ పాలనలో తెలంగాణ మైనారిటీల భవిష్యత్తుకై బంగారు బాటలు ఏర్పాటు చేయడం జరిగింది, 400 మైనార్టీలు విదేశాలలో 20 లక్షల జీతాలు తీసుకుంటూ ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన మైనార్టీల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి వాకిటి సునీతా లక్ష్మారెడ్డి,బీఆర్ఎస్ శ్రేణులు మైనార్టీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హోంమంత్రి మహమ్మద్ అలీ మాట్లాడుతూ సునీత లక్ష్మారెడ్డి అధిక మెజారిటీతో గెలుపు ఖాయమని తెలంగాణలో మరొకసారి కెసిఆర్ ప్రభుత్వం ఏర్పడి ఏర్పడుతుందని, మైనార్టీలు మాట ఇస్తే తప్పారని, 100% మైనార్టీల ఓట్లు బిఆర్ఎస్ కు పడతాయని, అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ కే మైనార్టీలు తెలంగాణ ప్రజలు పట్టం కడతారని తెలిపారు. మదన్ రెడ్డి ఎంపీ కావడం ఖాయమని, ఎమ్మెల్యే అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందుతుందని జిల్లా అభివృద్ధికి వీరిద్దరూ విశేషంగా కృషి చేస్తారని హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ తెలిపారు.
Read Also..
ఈ రోజు ఉదయం 11 గంటలకు కోనాయిపల్లి వెంకటేశ్వర ఆలయంలో నామినేషన్ పత్రాలతో కేసీఆర్, హరీశ్ రావులు ప్రత్యేక పూజలు…..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ సెంటిమెంట్ దేవాలయం కొనాయ పల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి రానున్నరు.
ఎన్నికల సమయంలో నామినేషన్ పత్రాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం కేసీఆర్ కు ఆనవాయితీ… అదే ఒరవడిని కొనసాగిస్తూ మంత్రి హరీశ్ రావు కూడా 2004 ఎన్నికల నుండి పెద్ద సారును ఫాలో అవుతూ విజయాలను నమోదు చేసుకుంటున్నారు. ఈసారి కూడా నామినేషన్ ఈ నెల 9వ తేదీన గజ్వెల్ రిటర్నింగ్ అధికారి ఎదుట నామినేషన్ పత్రాలను కేసీఆర్ దాఖలు చేయనున్నారు..ఐదు రోజుల ముందునే స్వామివారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారంలో కెసిఆర్, హరీష్ రావులు బిజీ బిజీగా ఉండడం, రేపు మంచి రోజు కావడంతో నామినేషన్ పత్రాలు పూర్తిచేసి పూజలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం లో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తుండడం,హరీశ్ రావుకు ఉమ్మడి మెదక్ జిల్లా బాధ్యతలు అప్పగించడంతో బిజీ బిజీ షెడ్యూల్ తో సభలలో పాల్గొంటున్నారు. కెసిఆర్ ఈ నెల 9వ తేదీన గజ్వేల్ రిటర్నింగ్ అధికారి వద్ద, సిద్దిపేట రిటర్నింగ్ అధికారి వద్ద హరీష్ రావు నామినేషన్ పాత్రాలను దాఖలు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బిఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్,హరీశ్ రావు లకు ఘనంగా స్వాగతం చెప్పేందుకు గ్రామస్తులు సిద్ధమయ్యారు ఎలక్షన్ల ప్రతిసారి కెసిఆర్,హరీశ్ రావులు ఈ గ్రామానికి రానుండడంతో గ్రామంలో పండుగ వాతావరణంలో వారికి ఘన స్వాగతం చెప్పేందుకు మహిళలు గ్రామస్తులు సిద్ధమయ్యారు.
నర్సాపూర్ మండలం కొండాపూర్ అడవి ప్రాంతంలో ఓ వ్యక్తి మృత దేహం వెలుగులోకి వచ్చింది. మృతుడు హైదరాబాద్ బోరబండకు చెందిన నోమన్ గా పోలీసులు గుర్తించారు. ఫారుక్ నేనే హత్య చేశానని పోలీసులకు లొంగిపోయాడు. బోరబండలో గొడవపడి నోమన్ ను చంపాలనే ఉద్దేశంతో తీసుకువచ్చి హత్య చేసినట్లు ఫారుక్ పోలీసులతో ఒప్పుకున్నాడు. ఈ కేసు పై పూర్తిస్థాయిలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.






Total views : 75135