Friday, July 17, 2026
News Navigation
Friday, July 17, 2026
News Navigation

Breaking

Friday, July 17, 2026
Home Latest News తెలంగాణలో సైబర్ నేరాలపై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష.

తెలంగాణలో సైబర్ నేరాలపై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష.

by CVR NEWS
తెలంగాణలో సైబర్ నేరాలపై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష

తెలంగాణలో సైబర్ నేరాల నియంత్రణ, దర్యాప్తు పురోగతి, మరియు భవిష్యత్ కార్యాచరణపై డీజీపీ సీవీ ఆనంద్ ఉన్నత స్థాయి సమగ్ర సమీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా నమోదైన సైబర్ కేసుల్లో అత్యధికంగా 44% తెలంగాణలోనే నమోదయ్యాయి. ప్రతి నాలుగు ప్రధాన నేరాల్లో ఒకటి సైబర్ నేరంగానే ఉండడంతో పోలీసులకు దిశానిర్దేశం చేసి తగు సూచనలిచ్చారు. 2025లో సైబర్ మోసాల వల్ల 1,524 కోట్ల నష్టం వాటిల్లినప్పటికీ, 2024తో పోలిస్తే ఆర్థిక నష్టాల్లో 20% తగ్గుదల నమోదైనట్లు తెలిపారు. బాధితుల ఖాతాల్లో నిలిపివేసిన నిధులు 255 కోట్ల నుంచి 279 కోట్లకు పెరిగాయి. బ్యూరో పరిధిలోని AI ఆధారిత సైబర్ కాల్ సెంటర్, సైబర్ ల్యాబ్, ఎస్‌ఒసి , డిజిటల్ ఫోరెన్సిక్ విభాగాల పనితీరును డీజీపీ ప్రశంసించారు. ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్లు, ఆన్‌లైన్ ట్రేడింగ్, డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు పెరుగుతున్నాయని, వీటిని కట్టడి చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. టెక్నాలజీ, డాటా అనలిటిక్స్‌ను ఉపయోగించి సైబర్ పోలీసింగ్‌లో దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలపాలని దిశానిర్దేశం చేశారు

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

040935
Total views : 212440

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: