53
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు మరో ముందడుగు పడింది. రూరల్ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి 299 మంది లబ్ధిదారులకు 14 కోట్ల 95 లక్షల విలువైన ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ను పంపిణీ చేశారు. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామాలు–తండాలు అనే తేడా లేకుండా అర్హులందరికీ దశలవారీగా పక్కా ఇళ్లు అందజేస్తామని స్పష్టం చేశారు. మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా రుణ సౌకర్యాలు కల్పించి లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.





Total views : 219357