క్యాష్లెస్ ట్రీట్మెంట్తో ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు ధైర్యంగా ఉండొచ్చని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల కోసం కొత్త ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ పోర్టల్ను మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి ఆయన ప్రారంభించారు. ఉద్యోగ సంఘాల నేతలకు కొత్త హెల్త్ కార్డులు అందజేశారు. ఈ పథకంలో ఉద్యోగుల నుంచి ప్రతి నెలా మూల వేతనంలో 1.5 శాతం చందా వసూలు చేస్తారు. అంతే మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. వైద్య చికిత్సలకు సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ రేట్లను వర్తింపజేస్తారు.
నగదు రహిత చికిత్స పథకాన్ని అందించాలని ఉద్యోగులు ఎన్నో ఏళ్లుగా అడుగుతున్నారని..పదేళ్లు అధికారంలో ఉన్నా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు భట్టి విక్రమార్క. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తోందని చెప్పారు. 9.5లక్షల మంది ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపేలా కొత్త EHS పోర్టల్ను తీసుకొచ్చామని తెలిపారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10లక్షలకు పెంచామని గుర్తు చేశారు. 1.06 కోట్ల మంది పేదలకు ఆరోగ్యశ్రీ కింద కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామని.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల బిల్లులను కూడా పెండింగ్లో పెట్టిందని భట్టి విమర్శించారు.
మరోవైపు ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అన్నారు మంత్రి దామోదర. కొత్త EHS కార్డుల ద్వారా ఆసుపత్రుల్లో పూర్తిగా రూపాయి ఖర్చు లేకుండా నగదు రహిత చికిత్సలు అందుతాయని స్పష్టం చేశారు. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 886 నెట్వర్క్ ఆసుపత్రులను అనుసంధానం చేశామని చెప్పారు. దాదాపు 1వెయ్యి816 రకాల వైద్య చికిత్సలు, ఆపరేషన్లను ఈ పథకం పరిధిలోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఉద్యోగులకు మరింత నాణ్యమైన, వేగవంతమైన సేవలు అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 24 వెల్నెస్ సెంటర్లను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు మంత్రి దామోదర స్పష్టం చేశారు.





Total views : 219357