పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు తగిన నీటి కేటాయింపులు జరపాలని, జిల్లా ప్రయోజనాలకు విఘాతం కలగకుండా చూడాలని మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి నేతృత్వంలోని ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేల బృందం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు వారు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఒక వినతిపత్రాన్ని అందజేశారు. ఎదుల–దిండి కాలువల ద్వారా నీటిని తరలించే ప్రతిపాదనను తక్షణమే విరమించుకోవాలని ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రిని కోరారు. ఈ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దీనిని పరిశీలించి అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూచించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ వరకు 2 టీఎంసీల నీటిని తరలించేలా తగిన చర్యలు తీసుకోవాలని వారు మంత్రిని కోరారు. అదేవిధంగా, శ్రీశైలం జలాశయం నుంచి నల్గొండ మరియు పాలమూరు–రంగారెడ్డి ప్రాంతాలకు తగిన విధంగా నీటి కేటాయింపులు కల్పించాలని కోరుతూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మరొక వినతిపత్రాన్ని సమర్పించారు. ఉమ్మడి జిల్లా సాగు, తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టుల నిర్వహణ ఉండాలని ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వానికి ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్యేల విజ్ఞప్తి.
49
previous post





Total views : 219357