ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు వ్యాఖ్యలకు టీపీసీసీ ఫిషర్మెన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వ భూములను దోచుకోవడం, భూ కబ్జాలకు పాల్పడటంలో శంభీపూర్ రాజు దిట్ట అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.కేటీఆర్ మోచేతి నీళ్లు తాగే శంభీపూర్ రాజుకు నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి కూడా ఆయనకు లేదన్నారు.2018 ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతిగా 3 వేల 016 రూపాయల ఇస్తామని బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టిందని, ఆ హామీ ఏమైందని మెట్టు సాయికుమార్ ప్రశ్నించారు. మరోసారి నిరుద్యోగులను, యువతను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.గత రెండున్నరేళ్లలో 79 వేల ఉద్యోగాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదేనని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే అర్హత కేసీఆర్, కేటీఆర్కు కూడా లేదని మెట్టు సాయికుమార్ వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుపై కాంగ్రెస్ నేత ఫైర్.
53





Total views : 219357