34
ఎల్నీనో ప్రభావం కారణంగా ఈ ఏడాది సాధారణం కంటే వర్షపాతం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అన్నారు మంత్రి పొంగులేటి. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొనే అవకాశమున్నప్పటికీ, దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ఆయన చెప్పారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని రాష్ట్ర ప్రభుత్వం నియమించిందన్నారు. జిల్లాల పరిస్థితులపై సమగ్ర నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపించి, అవసరమైన ఆర్థిక సహాయం, మద్దతు పొందేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరిస్థితిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన అన్ని చర్యలు చేపడుతుందని మంత్రి స్పష్టం చేశారు.




Total views : 223651