Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home Latest News కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం…

కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం…

by Prakash
The aim of the state government is to provide medical services at the corporate level

రాష్ట్రంలోని ప్రజలందరికీ కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలను ప్రభుత్వం ఉచితంగా అందించడమే లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు .పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనిలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో 142 కోట్ల సింగరేణి నిధులతో నూతనంగా నిర్మించే ఆసుపత్రి అదనపు భవనాల నిర్మాణానికి రామగుండం ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజ్ ఠాగూర్ తో కలిసి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన అన్ని రకాల వైద్య సేవలు అందించే విధంగా సకాలంలో భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని అన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మెడికల్ కళాశాలకు అనుసంధానంగా రాష్ట్ర ప్రభుత్వం నర్సింగ్ కళాశాలను సైతం మంజూరు చేసిందని అన్నారు. ప్రతి తెలంగాణ పౌరుడి హెల్త్ ప్రొఫైల్ రూపకల్పనకు చర్యలు తీసుకుంటామని అన్నారు.ఇప్పటి వరకు పెద్దపల్లి జిల్లాలో రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిమితి పెంచిన తర్వాత సుమారుగా రెండు వేల మంది చికిత్స పొందారని అన్నారు.రామగుండం కార్పోరేషన్ పరిధిలో అవసరమైన చోట బస్తీ దవాఖానాలు ఏర్పాటుకు కృషి చేస్తామని అన్నారు.
ఎమ్మెల్యేగా ఎం.ఎస్ రాజ్ ఠాగూర్ మాట్లాడుతూ సింగరేణి కార్మికులు ,సంస్థ చొరవతో ఇక్కడ మెడికల్ కళాశాల ఏర్పాటు జరిగిందని గుర్తుచేశారు.సింగరేణి సంస్థ సహకారంతో మరింత అభివృద్ధి చేసి ప్రజలకు అవసరమైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు.

Advertisements

You may also like

Our Visitor

009375
Total views : 62130

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.