Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Andhra PradeshKadapa అన్నదాతలకు విద్యుత్ అందించడమే తమ లక్ష్యం..

అన్నదాతలకు విద్యుత్ అందించడమే తమ లక్ష్యం..

by Rama
electric sub station

అన్నమయ్య జిల్లా.. రాయచోటిలో అన్నదాతలకు వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే తమ లక్ష్యం అని అన్నారు. ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, కలెక్టర్ గిరిషా పీఎస్. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణానికి సంబంధించి 33/11 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ ను విద్యుత్ శాఖ ఒస్డీ శ్రీనివాసులు, పర్యవేక్షణ ఇంజినీర్ రమణ, జేసి పరహన్ అహమ్మద్ లతో కలిసి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, కలెక్టర్ గిరిషా పీఎస్ లు ప్రారంబించారు. వీరికి సంబేపల్లి మండలం సర్పంచ్, వైకాప నాయకులూ, కార్యకర్తలు పుస్పగుచ్చాలతో స్వాగతం పలికారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు విద్యుత్ శాఖ ద్వారా ఎన్నో అద్బుతాలు చేయగలిగామన్నారు. అడిగిన ప్రతి రైతుకు ట్రాన్స్ ఫార్మర్ పెట్టగలుగుతున్నాం. సామాన్య రైతులకు ఒక ట్రాన్స్ఫార్మర్ కావాలంటే డబ్బులు, సిపారసుల తో ఎన్నో ఇబ్బందులు పడిన పరిస్థితులు. జగన్ మోహన్ రెడ్డి సిఎం అయిన తర్వాత రాయచోటి నియోజకవర్గం వ్యాప్తంగా 15 వేల కనెక్షన్ లు వుంటే ఈ నాలుగన్నర సంవత్సరకాలంలో సుమారు 6 వేల పైగా కనెక్షన్ లు ఇవ్వగాలిగాం అన్నారు. ఐదు వేలకు పైగా అన్నదాతలకు ట్రాన్స్ ఫార్మర్లు ఇవ్వగాలిగామన్నారు. గతంలో పాలకులు ఇదు సవత్సరాలు పరిపాలన చేసి కేవలం 18 వందల ట్రాన్స్ ఫార్మర్లు కుడా ఇవ్వలేకపోయారు. అదే విదంగా జగనన్న లే అవుట్ నందు జిల్లా కలెక్టర్ చొరవతో అన్ని రకాల వసతులను కల్పించడం జరుగుతుందన్నారు. పట్టణంలో కానీ, మండలాలలో కానీ విద్యుత్ సమస్యలు లేకుండా ప్రజలకు అన్నదాతలకు నాణ్యమైన విద్యుత్ సేవలు అందజేస్తున్న విద్యుత్ శాఖ అధికారులకు, సిబ్బందికి ఎమ్మెల్యే.. కలెక్టర్ లు ప్రత్యెక అభినందనలు తెలియజేశారు.

Advertisements

You may also like

Our Visitor

025747
Total views : 149050

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.