Thursday, June 18, 2026
News Navigation
Thursday, June 18, 2026
News Navigation

Breaking

Thursday, June 18, 2026
Home Andhra Pradesh వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం..

వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం..

by Rama
sri lakshminarasimha swamy

కదిరి పట్టణంలో వెలసిన శ్రీమద్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ మహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు భక్తులు పెద్ద ఎత్తున స్వామి వారి దర్శనానికి విచ్చేశారు. రాత్రి 12 గంటల నుండి భక్తులు క్యూ లైన్ లో స్వామి దర్శనానికి వేచి ఉండగా తెల్లవారుజామున మూడున్నర గంటలకి ఉత్తర ద్వారా దర్శనానికి భక్తులను అనుమతించగా గోవింద నామస్మరణతో తిరువీధులు మారుమ్రోగాయి. ఎంతో విశిష్టమైన ఈ పర్వదినాన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనంతో భక్తులు పరవశించిపోయారు. ముందుగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి కుటుంబ సభ్యులతో పాటు, ఆలయ ఈవో వెండిదండి శ్రీనివాసరెడ్డి, చైర్మన్ గోపాలకృష్ణ, పాలకమండ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisements

You may also like

Our Visitor

025380
Total views : 147115

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.