శాసనసభ ఎన్నికల్లో చెన్నూరు నియోజకవర్గం నుంచి గెలుపొందిన కాంగ్రెస్ నూతన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మొదటిసారిగా మందమర్రి పట్టణం పర్యటనలో భాగంగా సింగరేణి intuc యూనియన్ కార్యాలయం కి విచ్చేశారు. ఐఎన్టీయూసీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…. నాపై నమ్మకంతో అధిక మెజార్టీతో గెలిపించిన మందమర్రి ప్రజలకు యూనియన్ నాయకులకు నా ధన్యవాదములు సింగరేణిలో డిసెంబర్ 27 న జరుగబోయే ఎన్నికలకు intuc యూనియన్ కూడా గెలుపుకు కృషి చేస్తే intuc నాయకులకు సింగరేణి కార్మికులకు సహాయ సహకారాలు అందిస్తాను అన్నారు. అనంతరం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి intuc యూనియన్ నాయకులు ఘనంగా సన్మానం చేసి వారికీ కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన రేవంత్ రెడ్డి ప్రజారాజ్యమనే నినాదంతో ముందుకు సాగుతున్నారని సీఎంగా పదవి చేపట్టిన వెంటనే ఆరు గ్యారంటీ ల మీద సంతకం చేశారని సింగరేణి కార్మికుల సమస్యల హక్కు లఫై పోరాటం చేసి సమస్య పరిష్కారం చేస్తాను అని అన్నారు. ఈ కార్యక్రమం లొ INTUC యూనియన్ నాయకులు కంపల్లి సమ్మయ్య, బుమయ్య, మిట్ట సూర్య నారాయణ, అన్ని మైన్ల పిట్ సెక్రటరీ కార్మికులు పాల్గొన్నారు.
వివేక్ వెంకటస్వామి మందమర్రి పర్యటన….
246
previous post





Total views : 78168