133
మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ కేసులో తన పేరు రావడంపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మరోసారి స్పందించారు. తాను ఎలాంటి తప్పూ చేయలేదని, ఈ ఆరోపణల నుంచి నిర్దోషిగా బయటకు వస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ఆయన..ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్లో జరిగిన ఘటనలో తన పేరు ప్రస్తావనకు రావడం దురదృష్టకరమని..తాను డిన్నర్కు హాజరైన మాట వాస్తవమేనని..కానీ తాను ఎటువంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని, అందుకే ప్రజలకు, పార్టీ అధిష్టానానికి వాస్తవాలు తెలియజేస్తున్నానని వివరించారు.






Total views : 90712