Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Andhra Pradesh కోర్టు వాయిదాలు తో గిన్నిస్ బుక్ ఎక్కొచ్చు.. జగన్

కోర్టు వాయిదాలు తో గిన్నిస్ బుక్ ఎక్కొచ్చు.. జగన్

by Rama
jagan mohan reddy

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లో మాజీ కేంద్ర మంత్రి కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో రైతు ప్రభుత్వం అంటున్నా వైసీపీ, కరువు వచ్చి రైతులు ఇబ్బంది పడుతుంటే ఈ ప్రభుత్వం ఏమి చేస్తుందన్నారు. చంద్రబాబు పై వైసీపీ కేసు పెట్టింది. టీడీపీ కుడా జగన్ పై కేసు పెడితే జగన్ తట్టుకో గలరా అన్నారు. న్యాయ వ్యవస్థ ను మ్యానేజ్ చేస్తూ సిబిఐ కేసులో జగన్ 3700 వాయిదాలు తెచ్చుకున్నాడు. జగన్ వచ్చిన కోర్టు వాయిదాలు తో గిన్నిస్ బుక్ ఎక్కోచ్చన్నారు. జిల్లా మొత్తం ను తక్షణమే కరువు జిల్లాగ ప్రకటించి ప్రతి రైతుకు ఎకరాకు 50 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణాలో కాంగ్రెస్, ఏపీ లో టీడీపీ అధికారం చేపడుతుందని కోట్ల ధీమా వ్యక్తం చేశారు.గతంలో రాజశేఖర్ రెడ్డి కొడుకని జగన్ కు ఓటు వేశారు, ఈ సారి జగన్ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ కుడా మరో రష్యా గ మారుతుందన్నారు.

Advertisements

You may also like

Our Visitor

013977
Total views : 78754

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.