Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Latest News పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళి

పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళి

by CVR NEWS

ప్రజాస్వామ్య విలువల పరరక్షణే ధ్యేయమని మహాత్మాగాంధీ విగ్రహం సాక్షిగా కాంగ్రెస్ ఎంపీలు ప్రకటించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు మరో ఎనిమిది మంది ప్రతిపక్ష ఎంపీలపై వేసిన సస్పెన్షన్‌ రద్దయ్యింది. ఇవాళ ఎంపీల సస్పెన్షన్ రద్దు చేస్తున్నట్లు లోక్ సభ ప్రకటించింది. ఈ సందర్భంగా పార్లమెంటు ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఎంపీలు నివాళులర్పించారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, ప్రజల గొంతుకను సభలో వినిపించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
లోక్ సభ సజావుగా సాగేందుకు స్పీకర్ ఓం బిర్లా చేసిన సూచనలను ప్రస్తావించారు. సభలోకి ప్లకార్డులు తేవద్దని, వెల్‌లోకి రాకూడదని స్పీకర్ కోరారని, సభా మర్యాదలను తాము గౌరవిస్తామని తెలిపారు. సభలో ప్రజా సమస్యలపై చర్చించడానికి స్పీకర్ తగిన అవకాశం ఇవ్వాలని ఎంపీ చామల విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతున్న సమయంలో అధికార పక్షం నుండి అడ్డంకులు కలగకుండా, ఆయన మైక్రోఫోన్ కట్ చేయకుండా స్పీకర్ తటస్థంగా వ్యవహరించాలని చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisements

You may also like

Our Visitor

019171
Total views : 90054

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.