Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home National బెట్టింగ్‌ యాప్‌ కేసు వ్యవహారం..

బెట్టింగ్‌ యాప్‌ కేసు వ్యవహారం..

by Satya
Mahadev Betting

ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ మహదేవ్ బెట్టింగ్‌ యాప్‌ కేసు వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. బెట్టింగ్‌ యాప్‌ ప్రమోటర్ల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌కు రూ.508 కోట్లు చెల్లింపులు జరిగినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సంచలన విషయం బయటపెట్టింది. ఈ నేపథ్యంలో సీఎం బఘేల్‌పై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బెట్టింగ్‌ యాప్‌ ప్రమోటర్ల సాయంతోనే కాంగ్రెస్‌ రాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేస్తోందని స్మృతి ఇరానీ ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రచారం కోసం నిధులు సమకూర్చేందుకు హవాలా కార్యక్రమాలు నిర్వహిస్తోందని స్మృతి ఇరానీ ఆరోపించారు. సీఎం ప్రచారానికి బెట్టింగ్‌ల ద్వారా వచ్చిన అక్రమ డబ్బును వినియోగించడం ఆందోళన చెందాల్సిన విషయమన్నారు. దేశ ఎన్నికల చరిత్రలో ఇలా ఎన్నడూ జరగలేదన్నారు. అధికారంలో ఉండగా ఆయన బెట్టింగ్‌ గేమ్‌ ఆడారని స్మృతి ఇరానీ అన్నారు.

Advertisements

You may also like

Our Visitor

013697
Total views : 77964

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.