మాఫియాను సంపూర్ణంగా నిర్మూలిస్తామని మంత్రి దన్నసరి అనసూయ (సీతక్క) అన్నారు.మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రిమాట్లాడుతూ….గంజాయి ని సంపూర్ణంగా నిర్మూలించేందుకు కఠిన చర్యలు చేపడుతామని ప్రజాసంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని ,వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల నియామకాలను భర్తీ చేస్తామన్నారు.విద్యా శాఖలో జిల్లా వ్యాప్తంగా కేవలం ఇద్దరు ఎం.ఈ.ఓ లు విధులు నిర్వహించడాన్ని బట్టి గత పాలకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతోందని దీంతో విద్యాశాఖ అద్వానంగా మారిందని ధ్వజమెత్తారు.
మహబూబాబాద్ జిల్లా లోభూకబ్జాదారులపై చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేస్తామని హామీనిచ్చారు.అసంపూర్తిగా ఉన్న వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను పూర్తి చేస్తామని తెలిపారు. వర్షా కాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యశాఖ అధికారులు ప్రజల కు అందుబాటులో ఉండి ప్రజా ప్రతినిధులతో కలిసి సమన్వయంగా పనిచేయాలని కోరారు. ఇది తొలి సమావేశం కాబట్టి అధికారులను సున్నితంగా మందలించామని రాష్ట్రంలో డ్రగ్స్ కు బానిసలుగ మారడంతో మహిళలపై అఘాయిత్యాలు… ,త్వరలో మరోసారి సమీక్ష సమావేశం ను నిర్వహిస్తామని తెలిపారు.విధుల పట్ల నిర్లక్ష్యం చేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, మహబూబాబాద్ ఎం.పి గా గెలుపొందిన పోరిక బలరాం నాయక్ , ఎమ్మెల్యేలు డాక్టర్. మురళి నాయక్, డాక్టర్ రామచంద్రు నాయక్, కోరం కనకయ్య , ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు, మున్సిపల్ చైర్మన్ రాంమోహన్ రెడ్డి , జిల్లా అధికారులు పాల్గొన్నారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 91209