Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Andhra Pradesh వైకాపా బస్సు యాత్ర..

వైకాపా బస్సు యాత్ర..

by Rama
vaikapa Bus Yathra

ఇచ్చాపురం నుంచి వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆ పార్టీ నేతలు అన్నారు. గురువారం.. ఇచ్ఛాపురంలో మంత్రి బొత్స సత్యనారాయణ జెండా ఊపి బస్సు యాత్రను ప్రారంభించారు. గత నాలుగున్నరేళ్లుగా అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తా మన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసిన నాయకుడు సీఎం జగన్‌ అని అన్నారు. అన్ని వర్గాలకూ సంక్షేమ పథకాలు అందించామన్నారు. అవినీతికి తావులేకుండా సంక్షేమ పథకాలు అందించామని చెప్పారు. విద్యారంగంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టామన్నారు. నాడు-నేడుతో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనగ పేదల బతుకులు బాగుచేసిన ఘనత సీఎం జగన్‌దే అని వైసీపీ నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, మేరుగ నాగార్జున, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే వి.కళావతి పాల్గొన్నారు.

Advertisements

You may also like

Our Visitor

039450
Total views : 196877

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: