Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Telangana గర్వపడేలా ఎల్లారెడ్డి, కామారెడ్డిలను అభివృద్ధి చేస్తా

గర్వపడేలా ఎల్లారెడ్డి, కామారెడ్డిలను అభివృద్ధి చేస్తా

by Satya
KCR

ప్రజలు గర్వపడేలా ఎల్లారెడ్డి, కామారెడ్డిలను అభివృద్ధి చేస్తానని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో జరిగిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. బీఆర్‌ఎస్‌ ఎల్లారెడ్డి అభ్యర్థి జాజుల సురేందర్‌ను ఎన్నికల్లో ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మన దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిపోయినా ప్రజాస్వామ్యంలో రావాల్సినటువంటి పరిణితి ఇంకా రాలేదన్నారు. ఏ దేశాల్లో అయితే వచ్చిందో ఆ దేశాలు బ్రహ్మాండంగా దూసుకుపోతున్నాయన్నారు. ఎలక్షన్లు చాలా వచ్చాయి. పోయాయని ఇది మామూలుగా జరిగే విషయమేనన్నారు. అది కాకుండా రెండు విషయాలపై ప్రజలు గట్టిగా నిర్ణయిస్తే. చాలా మంచి జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. ఎన్నికల్లో అభ్యర్థి గుణం, గణం మంచీ చెడు, వ్యక్తిత్వంపై ప్రజలు ఆలోచన చేయాలని సూచించారు.

Advertisements

You may also like

Our Visitor

014400
Total views : 80105

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.