Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Devotional వేములవాడ క్షేత్రంలో భక్తుల పై పెరిగిన భారం….

వేములవాడ క్షేత్రంలో భక్తుల పై పెరిగిన భారం….

by Prakash
Vemulawada field

పేదల దేవుడు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి కొలువైయున్న వేములవాడ క్షేత్రంలో భక్తులపై వసతి గదుల భారం పెరిగింది. వసతి గదుల అద్దెను పెంచడంతోపాటు 100 రూపాయల అద్దె ఉన్న గదికి సైతం 12 శాతం జీఎస్టీ వసూలు చేయాలని నిర్ణయించడం వల్ల భక్తులపై భారం తడిసి మోపెడవుతోంది. గదుల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న రాజన్న ఆలయ అధికారులు కొత్త ధరల ప్రకారం అద్దెలు వసూలు చేస్తున్నారు.. గతంలో వెయ్యి రూపాయలు దాటిన గదికి మాత్రమే జీఎస్టీ పన్ను వసూలు చేయగా, తాజాగా వంద రూపాయల గదికి కూడా 12 రూపాయల జీఎస్టీని వసూలు చేస్తున్నారు. అద్దె గదుల ధరలను స్వల్పంగానే పెంచినప్పటికీ ప్రతి గదికి జీఎస్టీ పన్ను వసూలు చేయాలని నిర్ణయించడంతో భక్తులపై భారం అధికమవుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. భీమేశ్వర అతిథి గృహం, నందీశ్వర కాంప్లెక్స్ లోని ఏసి సూట్ గదులకు 2200 రూపాయల అద్దె ఉండగా దానిని 2500 పెంచారు. 300 రూపాయల జీఎస్టీతో కలిపి వీటి అద్దె 2800 వందలకు చేరింది. అమ్మవారి అతిథి గృహంలో వెయ్యి రూపాయల అద్దె ఉండగా దానిని 1500 రూపాయలకు పెంచారు. జీఎస్టీతో కలిపి భక్తులు 1680 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. నందీశ్వర కాంప్లెక్స్ లో నాన్ ఏసీ గది 350 రూపాయలు ఉండగా దానిని 150 రూపాయలు పెంచి 500 రూపాయలు చేశారు. దీంతో జీఎస్టీ కలిపి 560 చెల్లించాల్సి ఉంటుంది. పార్వతీపురం బ్లాకులలో 500 రూపాయల అద్దె ఉండగా 600 కు పెంచారు. జీఎస్టీతో కలిపి 672 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. పార్వతిపురంలో సాధారణ 200 రూపాయలు ఉండగా వంద రూపాయలు పెంచి 300 రూపాయలు చేయగా జీఎస్టీతో కలిపి 336 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. లక్ష్మీ గణపతి కాంప్లెక్స్ లో 250 రూపాయలు ఉండగా 150 రూపాయలు పెంచి 400 రూపాయలు చేశారు. జీఎస్టీతో కలిపి 448 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. శంకరపురం ధర్మశాలలో 50 రూపాయలు ఉండగా దానిని వంద రూపాయలు చేశారు. జీఎస్టీతో కలిపి 112 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. భీమేశ్వర సదన్ లోని గదుల అద్దెలను యధావిధిగా కొనసాగించాలని నిర్ణయించారు.

Advertisements

You may also like

Our Visitor

019245
Total views : 90145

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.