Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Andhra Pradesh కళ్యాణదుర్గంలో కరువు బృందం పర్యటన…

కళ్యాణదుర్గంలో కరువు బృందం పర్యటన…

by Prakash
Drought team visit to Kalyanadurgam

అనంతపురం జిల్లా అంటేనే కరువుకు నిలయంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రసిద్ది. అలాంటి జిల్లాలో రైతులు వేసిన పంటలు చేతికందక పెట్టిన పెట్టుబడులు చేతికి రాక ప్రతి సంవత్సరం పెట్టుబడులు నెత్తిన మోస్తూ చివరికి అప్పులు మిగులుతున్నాయే తప్ప ఆదాయం మిగిలిన దాఖలాలు లేవు. ప్రతి సంవత్సరమూ రాను రాను పంటలు వేసే రైతులు తగ్గిపోయి వేల హెక్టార్ల భూములు ఖాళీగా కనపడుతున్నాయి. ఈ సంవత్సరం జిల్లాలోని అన్ని మండలాలు కరువున పడితే కేవలం 43 మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రభుత్వం గుర్తించింది. కరువు మండలాలుగా గుర్తించిన కుడా రైతులకు ఏవిధమైన ఉపయోగం లేదని వాపోతున్నారు. ఇప్పుడు కేంద్రం నుంచి కరువు బృందం కళ్యాణదుర్గంలో పర్యటించారు. అధికారులు చెప్పిన సమాచారం కేంద్రానికి నివేదిస్తామని కరువు బృందం ప్రకటించింది.

Advertisements

You may also like

Our Visitor

039649
Total views : 199021

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: