Thursday, June 18, 2026
News Navigation
Thursday, June 18, 2026
News Navigation

Breaking

Thursday, June 18, 2026
Home Andhra PradeshEast Godavari నీట మునిగిన పొలాలను పరిశీలించిన టీడీపీ బృందం..

నీట మునిగిన పొలాలను పరిశీలించిన టీడీపీ బృందం..

by Rama
TDP Leaders

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం,ఏలేశ్వరం మండలం యర్రవరం గ్రామంలో మిచౌంగ్ తుఫాన్ కారణంగా నీటమునిగిన పంటపొలాలను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నియోజకవర్గ ఇంఛార్జి వరుపుల సత్యప్రభ రాజా ఆధ్వర్యంలో టిడిపి బృందం పరిశీలించారు. వరి, అరటి రైతులతో పంట నష్టాన్ని గురించి చర్చించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు చిక్కాల రామచంద్రరావు,బోళ్ల వెంకటరమణ,నియోజకవర్గ ఇంఛార్జి వరుపుల సత్యప్రభ మాట్లాడుతూ మిచౌంగ్ తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రతి రైతుని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో అధికారులు అంచనా వేసిన పంటనష్టం కంటే ఎక్కువే ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని వారందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. హుద్ హుద్, తిత్లీ, హరికేన్ తుఫాన్ల సమయాల్లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పరిశీలించి వెంటనే న్యాయం చేసారని గుర్తు చేశారు. తడిచిన, రంగు మారిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, అన్ని రకాల పంటలకు తగిన నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు.

Advertisements

You may also like

Our Visitor

025384
Total views : 147128

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.