Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Andhra Pradesh ఉభయ పరివార దేవాలయాల హుండీ లెక్కింపు…

ఉభయ పరివార దేవాలయాల హుండీ లెక్కింపు…

by Prakash
Hundi counting

శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో హుండీ లెక్కింపు నిర్వహించగా ఈ లెక్కింపు ద్వారా శ్రీశైల మల్లన్న దేవస్థానానికి గత సంవత్సరం కంటే కొద్దిగా ఆదాయం పెరిగింది. మొత్తం 6,14,22,180 రూపాయల నగదు రాబడిగా లభించగా ఈ ఆదాయాన్ని గత 28 రోజులలో కార్తీకమాసం సందర్భంగా శ్రీస్వామి అమ్మవార్లకు భక్తులు నగదు రూపంలో సమర్పించినట్టు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. ఈ హుండి లెక్కింపులో నగదుతో పాటుగా ఈ హుండీ లెక్కింపులో 403 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారు, 10 కేజీల 160 గ్రాముల వెండి లభించగా వీటితోపాటు పలు రకాల విదేశీ కరెన్సీ కూడా లెక్కించారు. అందులో 1118- యుఎస్ఏ డాలర్లు, 130 యూఏఈ దిర్హమ్స్, 100 యూకే ఫౌండ్స్, 40 – ఆస్ట్రేలియా డాలర్లు, 22 మలేషియా రింగిట్స్, 20- కెనడా డాలర్లు, 19 సింగపూర్ డాలర్లు, 10 – ఈరోస్ మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి. పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య దేవస్థానం ఈవో పెద్దిరాజు పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగింది ఈ లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.

Advertisements

You may also like

Our Visitor

014169
Total views : 79386

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.