Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Adilabaad సింగరేణి గేట్ మీటింగ్ లో వివేక్ వెంకటస్వామి..

సింగరేణి గేట్ మీటింగ్ లో వివేక్ వెంకటస్వామి..

by Rama
Vivek venkataswami

మందమర్రి సింగరేణి ఏరియా కేకే-5 గని పై ఉదయం షిప్ట్ లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఐఎన్టీయూసీ నాయకులు గేట్ మీటింగ్ నిర్వహించారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గేట్ మీటింగ్ లో పాల్గొన్నారు. వివిధ యూనియన్ లకు చెందిన నాయకులు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో ఐఎన్టీయూసీ లో చేరినారు. రాష్ట్ర అభివృద్ధి ద్యేయం గా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందనీ అన్నారు. కేసీఆర్ నిరంకుశ పాలన నుంచి విముక్తి చేసి ప్రజల పాలన కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. సింగరేణి సంస్థ లో 51 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానిదే సింగరేణి ప్రైవేటీకరణ జరగదనీ కార్మికులు అపోహలు వీడండి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త గనులు తీసుకొచ్చెందుకు ప్రణాళికలు చేస్తుందని అన్నారు. సింగరేణిలో కొత్త ఉద్యోగాలు తీసుకొచ్చి సింగరేణికి పూర్వ వైభవం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తుందనీ అన్నారు. సింగరేణి కార్మికుల సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆరు గ్యారంటీ లు ఇచ్చినట్టుగా ఐఎన్టీయూసీ యూనియన్ కార్మికులకు ప్రత్యేకంగా ఇస్తున్న ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని అన్నారు.
గతంలో మాదిరిగా సింగరేణి లో రాజకీయ జోక్యం ఉండదని అన్నారు. ఈ నెల 27 న జరిగే సింగరేణి ఎన్నికల్లో గడియారం గుర్తుకి ఓటు వేసి ఐఎన్టీయూసీ నీ బలపరచి భారీ మెజారిటీ తో గెలిపించుకోవాలని కార్మికులను కోరారు.

Advertisements

You may also like

Our Visitor

039500
Total views : 197180

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: