ఐదు డివిజన్లను గెలుచుకుని గుర్తింపు సంఘంగా విజయం సాధించిన AITUC. ఆరు డివిజన్లలో విజయం సాధించి ప్రాతినిధ్య సంఘంగా రెండవ స్థానంలో నిలిచిన INTUC. బెల్లంపల్లి ,మందమర్రి,శ్రీరాంపూర్, రామగుండం-1, రామగుండం-2 డివిజన్లలో AITUC విజయం. కార్పొరేట్, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు, భూపాలపల్లి, రామగుండం-3 డివిజన్లలో గెలుపొందిన INTUC. సంస్థ వ్యాప్తంగా 1999 ఓట్ల ఆదిక్యంతో INTUC పై విజయం సాధించిన AITUC. సింగరేణి సంస్థలో 4 వ సారి గుర్తింపు సంఘంగా ఎన్నికైన AITUC .
INTUC
సింగరేణి ఎలక్షన్ లో INTUC పోలీస్ లకు మధ్య స్వాల్ప ఘర్షణ. సింగరేణి ఎలక్షన్ లో భాగంగా మంచిర్యాల జిల్లా శ్రీరామ్ పూర్ SRP 1 గని వద్ద పోలీస్ లకు INTUC కార్యకర్తలకు మధ్య స్వాల్ప ఘర్షణ, AITUC నాయకులను పోలింగ్ కేంద్రంలోకి అనుమతుంచి క్యాంపెయిన్ చేపిస్తున్నారని పోలీస్ లతో వాగ్వివాదానికి దిగిన INTUC కార్యకర్తలు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి సింగరేణి లో కార్మికుల యూనియన్ ఎన్నికలు ఉదయం 07 గంటల నుంచి ప్రారంభమైనాయి. సత్తుపల్లి లోని JVR ఓసి, కిష్టరం ఓసి, కోల్ ట్రాన్స్పోర్ట్ ఏరియా లలో పని చేసే సింగరేణి కార్మికులు 984 మంది ఈ రోజు ఓటు హక్కు ను వినియోగించుకోనున్నారు. సత్తుపల్లి సింగరేణి లో ఇప్పటివరకు అధికారంలో ఉన్న TGBKS యూనియన్ కాస్తా… ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ అనుబంధ యూనియన్ INTUC లో భారీగా కార్మికులు చేరడం జరిగింది. దీంతో ఇక్కడ INTUC యూనియన్ బలంగా ఏర్పడి సింగరేణి ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించేందుకు ఆయా యూనియన్ నాయకులు ముమ్మరంగా ప్రచారం చేశారు. కార్మిక సంఘాల మధ్య ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు నడుమ ఎన్నికలు సజావుగా సాగుతున్నాయి.
కార్మికులకు ముక్క చుక్క ఆశ చూపి కార్మికులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న INTUC సంఘం, గడిచిన 10 సంవత్సరాలలో కార్మికులను పీల్చి పిప్పి చేసిన సంఘం అడుగుజాడలలో INTUC సంఘం నడుస్తుంది. రాజకీయ జోక్యాన్ని పెంచి పోషించే దిశగా అడుగులు వేస్తుంది. కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా, అసలు కార్మికుల గురించి ఒక్కసారి కూడా ఆలోచన చేయని సంఘం, కార్మికులు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుంటే ఒక్కసారి కూడా ఇటు వైపు చూడని సంఘం ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయని గెలుపు కోసం అడ్డమైన దారులు తొక్కుచున్నది. కార్మిక సోదరులారా ఇప్పటికైనా ఆలోచించండి కార్మికుల బాగు కోరే సంఘం ఏదో, స్వలాభం చూసుకునే సంఘం ఏదో. మనం ఎవ్వరికీ భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే మన కోసం ఎంతో మంది అమర నాయకులు సాధించి పెట్టిన హక్కులు మన దగ్గర ఉన్నాయి. అవి మన దగ్గర ఉన్నంత సేపు మనం ఎవరికి భయపడవలసిన అవసరం లేదు.
భయం అనే సంక్కెళ్లు తెంచుకొని ఒక్క అడుగు ముందుగా వేసిచూడు నీ బలం ఏంటో నీకే తెలుస్తుంది. నీ వెనుక ఎర్ర జెండ ఉంది, నీకు అండగా AITUC నాయకులు ఉన్నారని సీతారామయ్య అన్నారు. ఆలోచించు మన హక్కులను కాపాడుతూ సింగరేణి ని కాపాడే మన AITUC ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలి. AITUC గెలుపు సింగరేణి కార్మికుని గెలుపు నక్షత్రం చుక్క గుర్తుకే ఓటు వేసి గెలిపించండి అని కోరారు.
Read Also..
రేపు జరగనున్న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర కార్మిక సంఘం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్లలో 39 వేల 748 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల కోసం 84 పోలింగ్ కేంద్రాలను, 7 వందల మంది సిబ్బందిని కేటాయించారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత శ్రీరాంపూర్, రామగుండం, భూపాలపల్లి, కొత్తగూడెం లలో కౌంటింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలో జరగనున్న ఎన్నికలలో 13 కార్మిక సంఘాలు బరిలో నిలిచాయి. 1998 నుండి సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తుండగా, తొలిసారి AITUC విజయం సాధించింది. ఇప్పటివరకు ఆరుసార్లు ఎన్నికలు నిర్వహించగా మూడుసార్లు AITUC, రెండుసార్లు TBGKS, ఒకసారి INTUC విజయం సాధించాయి.
Read Also..
Read Also..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మరికాసేపట్లో సింగరేణి ఎన్నికల ప్రచారం ముగియనున్నది. గుర్తింపు సంఘం కోసం జరిగే ఎన్నికల్లో కార్మిక సంఘాల నేతలు పోటాపోటిగా ప్రచారం చేసారు. ప్రచారంలో కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, మరియు బిఆరెఎస్ & కమ్యూనిస్ట్ నేతలు పాల్గొన్నారు. ఈరోజు 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనున్నది. 27న ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగియనున్నది. అనంతరం కౌంటింగ్ జరుగుతుంది. అధికారులు ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సింగరేణి అధికారులు, కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 6 జిల్లాలు, 12 నియోజకవర్గాలు, 13 ఏరియాలలో మొత్తం 39991 మంది కార్మిక ఓటర్లు ఉన్నారు అలాగే 14 గుర్తింపు కార్మిక సంఘాలున్నాయి. భూపాలపల్లిలో మొత్తం మైన్స్ పై 9 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసారు. 5350 మంది ఓటును నమోదు చేసుకున్నారు. ప్రధానంగా ఈ ఎన్నికల పోటీలో INTUC, AITUC, TBGKS, CITU, HMS, BMS కార్మిక సంఘాలున్నాయి.
సింగరేణిలో ఏడో విడత ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. ఈ నెల 27న సింగరేణి వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించనున్నారు. సింగరేణిలో అన్ని పార్టీలు తమ సత్తా చాటేందుకు తీవ్రంగా శ్రమించాయి. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. సింగరేణిలో ప్రస్తుతం సుమారు 40 వేల మంది కార్మికులు పాల్గొననున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం ఐఎన్టియుసి కూడా విజయ కేతనం ఎగుర వేసేందుకు ఊవ్విళ్లూరుతోంది. బిఆర్ఎస్ అనుబంధ సంస్థ టిబిజికెఎస్, సిపిఐ అనుబంధ కార్మిక సంఘం ఎఐటియుసి, కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టియుసి యూనియన్ల మధ్యే ప్రధాన పోటీ కొన సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిఐటియు, బిఎంఎస్, హెచ్ఎంఎస్ జాతీయ సంఘాలు కూడా పోటీలో ఉండి ఉనికి కోసం ఉబలాటపడుతున్నాయి.
మందమర్రి సింగరేణి ఏరియా కేకే-5 గని పై ఉదయం షిప్ట్ లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఐఎన్టీయూసీ నాయకులు గేట్ మీటింగ్ నిర్వహించారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గేట్ మీటింగ్ లో పాల్గొన్నారు. వివిధ యూనియన్ లకు చెందిన నాయకులు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో ఐఎన్టీయూసీ లో చేరినారు. రాష్ట్ర అభివృద్ధి ద్యేయం గా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందనీ అన్నారు. కేసీఆర్ నిరంకుశ పాలన నుంచి విముక్తి చేసి ప్రజల పాలన కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. సింగరేణి సంస్థ లో 51 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానిదే సింగరేణి ప్రైవేటీకరణ జరగదనీ కార్మికులు అపోహలు వీడండి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త గనులు తీసుకొచ్చెందుకు ప్రణాళికలు చేస్తుందని అన్నారు. సింగరేణిలో కొత్త ఉద్యోగాలు తీసుకొచ్చి సింగరేణికి పూర్వ వైభవం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తుందనీ అన్నారు. సింగరేణి కార్మికుల సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆరు గ్యారంటీ లు ఇచ్చినట్టుగా ఐఎన్టీయూసీ యూనియన్ కార్మికులకు ప్రత్యేకంగా ఇస్తున్న ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని అన్నారు.
గతంలో మాదిరిగా సింగరేణి లో రాజకీయ జోక్యం ఉండదని అన్నారు. ఈ నెల 27 న జరిగే సింగరేణి ఎన్నికల్లో గడియారం గుర్తుకి ఓటు వేసి ఐఎన్టీయూసీ నీ బలపరచి భారీ మెజారిటీ తో గెలిపించుకోవాలని కార్మికులను కోరారు.
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తరహాలో గెలుపే లక్ష్యంగా యూనియన్లు హామీలను కార్మికుల గనుల పై స్థానిక ఎమ్మెల్యేలు, యూనియన్లు ప్రచారం నిర్వహిస్తున్నాయి. సింగరేణి గుర్తిపు సంఘం ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ INTUC ఆధ్వర్యంలో శ్రీరామ్ పూర్ ఏరియా ఆర్కే 7, 7A గనులు వర్క్ షాప్ ల వద్ద ప్రచారం నిర్వహించారు. గడియారం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రచారం లో కార్మికులను కోరారు. ఆయన వెంట సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ నెల 27వ తేదీన సింగరేణి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో 13 యూనియన్లు బరిలో నిలిచాయి.
తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయినా సింగరేణిలో ఏడో విడత గుర్తింపు సంఘం ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఎన్నికల వాయిదా వేయాలని ప్రభుత్వం తరఫున వేసిన పిటిషన్ హైకోర్టు కొట్టి వేసింది. దీంతో ఈనెల 27న గుర్తింపు సంఘం ఎన్నికలు యధావిధిగా జరగనున్నాయి. సింగరేణి వ్యాప్తంగా 12 డివిజన్లో ఉన్న 39,784 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ మేరకు సింగరేణి యాజమాన్యం ఎన్నికలకు ఏర్పాట్లు చేనుంది. సింగరేణి వ్యాప్తంగా గుర్తింపు కోసం 14 కార్మిక సంఘాలు బరిలో నిలిచాయి. అధికార కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐ ఎన్ టి యు సి, సిపిఐ అనుబంధ ఎఐటియుసి, బిఅర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం, బిజెపి అనుబంధ బిఎంఎస్ తో పాటు హెచ్ఎంఎస్ సంఘాలతో పాటు విప్లవ సంఘాలు బరిలో నిలిచాయి. అసెంబ్లీ ఎన్నికలలో సింగరేణి వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుపొందడంతో పోటీ రసవత్తరంగా మారనుంది. గత రెండు పర్యాయాలు గుర్తింపు సంఘం గా వ్యవహరించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ను కార్మికులు తిరిగి ఆదరిస్తారా లేక మరో సంఘానికి పట్టం కడతారా వేచి చూడాలి.






Total views : 77938