Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home TelanganaKhammam సింగరేణి లో సజావుగా సాగుతున్న ఎన్నికలు..

సింగరేణి లో సజావుగా సాగుతున్న ఎన్నికలు..

by Rama
Singareni Elections

ఖమ్మం జిల్లా సత్తుపల్లి సింగరేణి లో కార్మికుల యూనియన్ ఎన్నికలు ఉదయం 07 గంటల నుంచి ప్రారంభమైనాయి. సత్తుపల్లి లోని JVR ఓసి, కిష్టరం ఓసి, కోల్ ట్రాన్స్పోర్ట్ ఏరియా లలో పని చేసే సింగరేణి కార్మికులు 984 మంది ఈ రోజు ఓటు హక్కు ను వినియోగించుకోనున్నారు. సత్తుపల్లి సింగరేణి లో ఇప్పటివరకు అధికారంలో ఉన్న TGBKS యూనియన్ కాస్తా… ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ అనుబంధ యూనియన్ INTUC లో భారీగా కార్మికులు చేరడం జరిగింది. దీంతో ఇక్కడ INTUC యూనియన్ బలంగా ఏర్పడి సింగరేణి ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించేందుకు ఆయా యూనియన్ నాయకులు ముమ్మరంగా ప్రచారం చేశారు. కార్మిక సంఘాల మధ్య ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు నడుమ ఎన్నికలు సజావుగా సాగుతున్నాయి.

Advertisements

You may also like

Our Visitor

013707
Total views : 77975

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.