బైరెడ్డిపల్లి మండలం కడపనత్తం గ్రామానికి చెందిన హోటల్ యజమాని నాగభూషణం కుమారుడు గోపి(17) రెండు రోజులుగా కనబడడం లేదు. మంగళవారం ఉదయం కడపనత్తం చెరువులో శవమై తేలాడు. సమాచారం అందుకున్న కుటుంబీకులు విలవిస్తూ గోపి మృతదేహాన్ని గుర్తించి ఇంటికి తీసుకువెళ్లారు. గోపికి మతిస్థిమితం సరిగా లేదని సమాచారం. పూర్తి వివరాలు బైరెడ్డిపల్లి పోలీసులు దర్యాప్తులో తేలాల్సి ఉంది.