Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Crime ఘోర రోడ్డు ప్రమాదం…

ఘోర రోడ్డు ప్రమాదం…

by Prakash
DCM is the cause of the accident

వారం సంతదినం కావడంతో కూరగాయలు, సరుకుల కోసం వచ్చిన గ్రామీణులు తిరుగు ప్రయాణంలో ఆటోలో వెళుతుండగా డీసీఎం వాహనం అతివేగంగా ఢీకొంది. ఇందులో 4 మంది అక్కడికక్కడే దుర్మరణం కాగా బైక్ పై వెళ్తున్న మరొకరికి తీవ్ర గాయాలై ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు స్థానికులు తెలిపారు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని చౌరస్తాలో చోటు చేసుకుంది. సంతదినం కావడంతో అక్కడ చౌరస్తాలో పోలీసు సిబ్బంది కూడా పర్యవేక్షణలో లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు భావిస్తున్నారు. మృతులంతా మండలంలోని మోతి ఘనాపూర్ గ్రామానికి చెందిన వారని స్థానికులు తెలుపుతున్నారు. మృతుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సంఘటనలో చిన్న పిల్లలు సైతం ప్రమాదానికి గురై మృత్యువాత పడడంతో ఈ హృదయ విదారక దృశ్యాలు చూసి స్థానికులు బోరున విలపిస్తున్నారు. డీసీఎం వాహనం హైదరాబాద్ నుండి జడ్చర్ల వైపు వెళుతుండగా చౌరస్తాపై ఆటోను అత్యంత వేగంగా ఢీ కొన్నట్టు స్థానిక ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అదేవిధంగా బైక్ పై మరో వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు కూడా చెబుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ఆగ్రహించిన స్థానికులు డీసీఎం అద్దాలు పగల కొట్టి ఆందోళన చేపట్టారు.

Advertisements

You may also like

Our Visitor

014296
Total views : 79775

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.